Difference between revisions 1391727 and 1415185 on tewiki

{{యాంత్రిక అనువాదం}} {{శుద్ధి}}
{{దక్షిణ ఆసియా చరిత్ర‎}}
{{Infobox Former Country
|native_name = 
|conventional_long_name = మైసూరు సామ్రాజ్యం / మైసూరు రాజ్యం -میسور سلطنت 
|common_name = మైసూరు
|continent = moved from Category:Asia to the South Asia
|region  = దక్షిణ ఆసియా
|country  = భారతదేశం
|status  = సామ్రాజ్యం 
|status_text = [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] 1565 వరకూ సామంతరాజ్యం. <br>  [[:en:British Raj|బ్రిటిష్ రాజ్]] లోని [[:en:paramountcy|paramountcy]] లో  1799 నుండి [[:en:Princely state|Princely state]] 
|government_type = [[:en:Monarchy|రాజరికం]] 1799 వరకూ, [[:en:Principality|Principality]] thereafter
|event_start = 
|year_start = 1399
|date_start = 
|event_end  = 
|year_end  = 1947
|date_end  = 
|event1   = Earliest records
|date_event1 = 1551
|p1     = Vijayanagara Empire
|flag_p1   = Flag of Mysore.svg
|s1     = India
|flag_s1   = Flag of India.svg
|s2     = 
|flag_s2   =
|image_map  = Indian Mysore Kingdom 1784 map.svg
|image_map_caption = {{legend|#FF9F80|మైసూరు రాజ్యం విస్తీర్ణత , క్రీ.శ. 1784 }}
|capital      = [[మైసూరు]], [[శ్రీరంగపట్టణం  ]]
|national_anthem  = ''కయౌ శ్రీ గౌరీ ''
|common_languages = [[కన్నడ భాష|కన్నడ]] & [[ఉర్దూ భాష|ఉర్దూ]], 
|religion     = [[హిందూమతం]], [[ఇస్లాం]] 
|leader1   = యదురాయ 
|leader3   = జయ చామరాజ వడయార్ 
|year_leader1 = 1399&ndash;1423 (మొదటి)
|year_leader3 = 1940&ndash;1947 (చివరి)
|title_leader = [[:en:Maharaja of Mysore|మహారాజ  ]]
}}

'''మైసూర్ రాజ్యం''' ([[కన్నడ భాష|కన్నడ]] ಮೈಸೂರು ಸಂಸ್ಥಾನ ''maisūru saṃsthāna'' ) ([[ఉర్దూ భాష|ఉర్దూ]] میسور سلطنت )  (1399–1947 AD) అనేది దక్షిణ భారతదేశంలో ఒక రాజ్యం, సాంప్రదాయికంగా ఆధునిక [[మైసూరు|మైసూర్]] నగర పరిసరాల్లో 1399లో దీనిని స్థాపించారనే భావన ఉంది. వడయార్ కుటుంబం పాలించిన ఈ సంస్థానం మొదట [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]]లో ఒక సామంత రాజ్యంగా ఉండేది. విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో (సుమారుగా 1565) ఇది స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 17వ శతాబ్దంలో [[నరసరాజ వడయార్]] మరియు [[చిక్క దేవరాజ వడయార్]] హయాంలో దీని యొక్క భూభాగం క్రమక్రమంగా విస్తరించబడింది, ప్రస్తుత దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇది దక్షిణ [[దక్కను పీఠభూమి]] (దక్షిణాపథం)లో శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది.  

18వ శతాబ్దం ద్వితీయార్ధ భాగంలో అసలు పాలకుడు [[హైదర్ అలీ|హైదర్ అలీ]] మరియు ఆయన కుమారుడు [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాన్]] హయాంలో ఈ రాజ్యం యొక్క సైనిక శక్తి మరియు అధికార పరిధి ఉన్నత స్థితికి చేరుకుంది. ఈ సమయంలో, మరాఠాలు, బ్రిటీష్‌వారు మరియు [[గోల్కొండ]] [[నిజాం|నిజాం]] రాజులతో ఈ రాజ్యం యుద్ధం చేసింది, నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలతో ఈ పోరు అంతిమ దశకు చేరుకుంది. మొదటి రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో మైసూర్ రాజ్యం విజయం సాధించగా, మూడు మరియు నాలుగో యుద్ధాల్లో పరాజయం చవిచూసింది. 1799లో నాలుగో యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత, ఈ రాజ్యంలో ఎక్కువ భూభాగాలను బ్రిటీష్‌వారు స్వాధీనం చేసుకున్నారు, ఈ పరిణామంతో దక్షిణ దక్షిణాపథంలో మైసూర్ రాజ్య ఆధిపత్యానికి తెరపడింది. అయితే బ్రిటీష్‌వారు ఒక స్వాధీన రాజ్యం రూపంలో మైసూర్ సింహసనాన్ని తిరిగి వడయార్ కుటుంబీకులకు అప్పగించారు, తరువాత (contracted; show full)ుక్కుసూటి") ఈ రాజవంశంలో రాజకీయ ప్రాధాన్యత గల మొదటి రాజుగా ఖ్యాతి గడించారు, ఆయన నామమాత్రపు విజయనగర చక్రవర్తి అరవీడు రామరాయ హయాంలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు.<ref name="bald">సుబ్రహ్మణ్యం (2001), పే. 67</ref> అరవీడు రామరాయ మరణం తరువాత, వడయార్‌లు తమ ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు, రాజ వడయార్ I విజయనగర గవర్నర్ (''మహామండలేశ్వరా'' ) అరవీడు తిరుమల నుంచి [[శ్రీరంగపట్టణం|శ్రీరంగపట్నాన్ని]] స్వాధీనం చేసుకున్నారు - విజయనగర సామ్రాజ్యం పతనమవుతున్న దశలో [[చంద్రగిరి
|చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకొని పాలించిన వెంకటపతిరాయ, ''ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో'' పరిధిలో, ఈ పరిణామానికి రహస్య ఆమోదం తెలిపారు.<ref name="channa">సుబ్రహ్మణ్యం (2001), పే 68</ref> రాజ వడయార్ I పాలనా కాలంలో కూడా భూభాగ విస్తరణ జరిగింది, ఈ సమయంలో ఉత్తరంవైపు జగ్గదేవరాయ నుంచి చెన్నపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారు<ref name="channa"></ref /><ref>వెంకట రామనప్ప, M. N. (1975), పే. 200</ref> - ఈ పరిణామం మైసూర్‌ను ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా వెలుగులోకి తీసుకొచ్చింది.<ref name="sov">కామత్ లో షమ రావు (2001), పే. 227</ref><ref>వెంకట రామనప్ప, M. N. (1975), పే.201</ref>
[[File:Narasaraja Wadiyar II.jpg|thumb|1704 నుండి 1714 వరకు పాలించిన [[నరసరాజ వడయార్ II]]. ఆయనకు మూకరసు అనే పేరు కూడా ఉంది.]]
ఆపై, 1612-13 సమయానికి, వడయార్‌లు విస్తృతమైన స్వయంప్రతిపత్తిని పొందారు, అప్పటికీ వీరిని అరవీడు రాజులకు సామంతులుగానే పరిగణిస్తున్నప్పటికీ, చంద్రగిరికి కప్పం చెల్లింపులు మరియు ఆదాయ బదిలీలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే వీరికి భిన్నంగా తమిళ దేశ పాలకులు (''నాయకులు'' ) [[చంద్రగిరి]]కి 1630వ దశకం వరకు కప్పాలు చెల్లించారు.<ref name="channa"></ref /> చామరాజ V మరియు కాంతిరవా నరసరాజ I తమ భూభాగాన్ని ఉత్తరంవైపుకు మరింత విస్తరించడానికి ప్రయత్నించారు, [[బీజాపూర్ సల్తనత్|బీజాపూర్ సల్తనత్]] మరియు దాని యొక్క మరాఠా సామంత రాజ్యాలు వీరి ప్రయత్నాలను అడ్డుకున్నాయి, ఇదిలా ఉంటే 1638లో శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన రాణాదుల్లా ఖాన్ నేతృత్వంలోని బీజాపూర్ సైన్యాన్ని వడయార్ రాజులు సమర్థవంతంగా తిప్పికొట్టారు.<ref name="coimbotore">సుబ్రహ్మణ్యం (2001), పే 68; కామత్ (2001), పే. 228</ref><ref name="ranadulla">వెంకట రామనప్ప, M. N. (1975), పే. 201</ref> తరువాత విస్తరణ చర్యలను దక్షిణంవైపు ఉన్న తమిళ దేశంపై చేపట్టారు, నరసరాజ వడయార్ సత్యమంగళం ప్రాంతాన్ని (ఆధునిక ఉత్తర [[కోయంబత్తూరు|కోయంబత్తూరు]] జిల్లా) స్వాధీనం చేసుకున్నారు, ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన దొడ్డ దేవరాజ వడయార్ మరింత ముందుకెళ్లి మదురై రాజులపై విజయం సాధించడం ద్వారా తమిళ ప్రాంతాలైన ఈరోడ్ మరియు ధర్మపురిలను స్వాధీనం చేసుకున్నారు. మల్నాడుకు చెందిన కెలాడి నాయకాల దండయాత్రను కూడా విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ కాలం తరువాత ఒక సంక్లిష్టమైన భౌగోళిక-రాజకీయ మార్పులు సంభవించాయి, ఈ సమయంలో, అంటే 1670వ దశకంలో, మరాఠాలు మరియు మొఘల్‌వారిని దక్కను ప్రాంతానికి పరిమితం చేశారు.<ref name="coimbotore"></ref /><ref name="ranadulla"></ref />

మైసూర్ ప్రారంభ రాజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన చిక్క దేవరాజ (1672-1704) ఈ కాలంలోనే పాలన సాగించారు, ఆయన అత్యంత కఠిన పరిస్థితుల్లో మనుగడ సాధించడంతోపాటు, తమ భూభాగాన్ని మరింత విస్తరించారు. మరాఠాలు మరియు [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్]] రాజులతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆయన ఈ విజయాలు సాధించారు.<ref name="alliance">సుబ్రహ్మణ్యం (2001), పే.71</ref><ref name="early">కామత్ (2001), పేజీలు. 228–229</ref> రాజ్యం తరువాత కొద్ది కాలానికే తూర్పున [[సేలం|సేలం]] మరియు [[బెంగుళూరు|బెంగళూరు]], పశ్చిమాన హస్సాన్, ఉత్తరాన చిక్కమంగళూరు మరియు తుంకూర్ మరియు దక్షిణాన [[కోయంబత్తూరు|కోయంబత్తూరు]] వరకు విస్తరించింది.<ref name="salem">సుబ్రహ్మణ్యం (2001), పే.69; కామత్ (2001), పేజీలు. 228–229</ref> ఈ విస్తరణ ఫలితంగా [[పడమటి కనుమలు|పశ్చిమ కనుమల]] నుంచి కోరమండల్ మైదానం యొక్క పశ్చిమ సరిహద్దుల వరకు దక్షిణ భారతదేశం నడిబొడ్డున గణనీయమైన భూభాగాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, ఈ రాజ్యం ఎటువంటి సముద్రతీరం లేకుండా అన్నివైపులా భూహద్దులకే పరిమితమైంది. దీనికి పరిష్కారం కోసం చిక్క దేవరాజ చేసిన ప్రయత్నాలు మైసూర్ రాజ్యానికి ఇక్కెరీకి చెందిన ''నాయకా'' రాజులు మరియు కొడగు (ఆధునిక(contracted; show full)్ గ్రంథాలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, చరిత్రకారుడు సూర్యనాథ్ కామత్ అభిప్రాయం ప్రకారం మొఘల్ రాజులు మైసూర్‌ను తమకు మిత్రరాజ్యంగా భావించేవారు, దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం కోసం మొఘల్-మరాఠాల పోటీ ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని సూచించారు.<ref name="peinisular">సుబ్రహ్మణ్యం (2001), పేజీలు. 70–71; కామత్ (2001), పే. 229</ref> 1720వ దశకానికి, మొఘల్ సామ్రాజ్యం పతనం కావడంతో, ఆర్కాట్ మరియు సిరా రెండు ప్రాంతాల్లో మొఘల్‌వారికి కప్పం వసూలు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి.<ref name="alliance"
></ref /> తరువాతి సంవత్సరాల్లో కృష్ణరాజ వడయార్ I కొడుగు పాలకులు మరియు మరాఠాలను తీరం వద్ద ఉంచుతూ ఈ విషయంపై జాగ్రత్తగా స్పందించారు. ఆయన తరువాత చామరాజ వడయార్ VI పాలనా పగ్గాలు చేపట్టారు, ఆయన పాలనా కాలంలో అధికారం ప్రధానమంత్రి (''దాల్వాయ్'' లేదా ''దాలావోయ్'' ) నాంజరాజయ్య (లేదా నాంజరాజా) మరియు ముఖ్యమంత్రి (''సర్వాధికారి'' ) దేవరాజయ్య (లేదా దేవరాజా) చేతుల్లోకి వెళ్లిపోయింది, నాంజన్గుడ్ సమీపంలోని కలాలే పట్టణానికి చెందిన ప్రభావవంతమైన ఈ ఇద్దరు సోదరులు తరువాతి మూడు దశాబ్దాలపాటు రాజ్యపాలన సాగించారు, వడయార్ కుటుంబీకులు నామమాత్రపు అధిపతులుగా ఉండిపోయారు.<ref name="right">ప్రాణేష్ (2003), పేజీలు. 44–45</ref><ref name="bahadur">కామత్ (2001), పే. 230</ref> కృష్ణరాజా II తరువాతి పాలనా కాలంలో దక్కను సుల్తానేట్‌లు మొఘల్ వారి ప్రభావంతో మరుగున పడ్డాయి, ఈ గందరగోళంలో ఒక సేనాధిపతి అయిన [[హైదర్ అలీ|హైదర్ అలీ]] ప్రాచుర్యంలోకి వచ్చారు.<ref name="ranadulla"></ref /> 1758లో [[బెంగుళూరు|బెంగళూరు]] వద్ద మరాఠాలపై సాధించిన విజయం ఫలితంగా వారి భూభాగం హైదర్ అలీ చేతికి వచ్చింది, ఆయన ఒక్కసారిగా ప్రముఖ నాయకుడిగా తెరపైకి వచ్చారు. ఆయన సాధనలకు గౌరవసూచకంగా, రాజు ఆయనకు "నవాబ్ హైదర్ అలీ ఖాన్ బహదూర్" పట్టం ఇచ్చారు<ref name="bahadur"></ref />. అయితే అప్పటికే హైదర్ అలీ కొన్ని సైనిక విజయాలను చవిచూశారు. కర్నూలు నవాబును గెలిచి ఆయన రాజ్యాన్ని మైసూరు సామ్రాజ్యానికి సామంత రాజ్యం చేశారు<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>.

===హైదర్ మరియు టిప్పు హయాం===
[[File:Purniya,_  Chief_  Minister_  of_  Mysore.tif|thumb|మైసూర్ రాజ్య దివాన్ పూర్ణయ్య పంతులు]]
నిరక్ష్యరాస్యుడైనప్పటికీ, యుద్ధ నైపుణ్యాలు మరియు చురుకైన పాలన ఫలితంగా [[హైదర్ అలీ]] కర్ణాటక చరిత్రలో సుప్రసిద్ధ స్థానాన్ని పొందారు.<ref name="prow">కామత్ లో షమ రావు (2001), పే. 233</ref><ref name="prow1">ఒక మిలిటరీ నిపుణుడు మరియు అత్యంత భలం, తేజం మరియు సమృద్ి కలిగిన వ్యక్తీ,(చోప్రా et al. 2003, పే. 76)</ref> ఉపఖండంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో హైదర్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో యూరోపియన్ రాజ్యాలు తమను తాము వాణిజ్య సంస్థల రూపం నుంచి రాజకీయ శక్తులుగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉండగా, మొఘల్ ''సూబేదార్‌'' గా నిజాం దక్కను ప్రాంతంలో తన లక్ష్యాలను సాధించారు, మరాఠాలు పానిపట్ యుద్ధంలో పరాజయం తరువాత దక్షిణాదిలోని సురక్షిత ప్రాంతాలవైపు వెనుకంజ వేశారు. ఈ కాలంలో కర్ణాటకపై పట్టు కోసం బ్రిటీష్‌వారితో ఫ్రెంచ్‌వారు పోటీ పడ్డారు- ఈ పోటీలో బ్రిటీష్‌వారు అంతిమ విజేతలుగా నిలిచారు, బ్రిటీష్ కమాండర్ సర్ ఐర్ కూట్ నేతృత్వంలోని సైన్యం 1760లో జరిగిన వాండ్‌విష్ యుద్ధంలో కాంమ్టే డి లిల్లీ నేతృత్వంలోని ఫ్రెంచ్ సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించింది, దక్షిణాసియాలో బ్రిటీష్‌వారి ఆధిపత్యాన్ని పటిష్టపరిచిన ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక పరిణామంగా గుర్తించపడుతుంది.<ref name="Venkata Ramanappa 1975 p. 207">వెంకట రామనప్ప, M. N. (1975), పే 207</ref> ఈ కాలంలో మైసూర్‌కు వడయార్‌లు నామమాత్రపు అధిపతులుగా కొనసాగినప్పటికీ, అసలు అధికారం మాత్రం హైదర్ అలీ మరియు ఆయన కుమారుడు [[టిప్పు సుల్తాన్|టిప్పు]] చేతుల్లోకి వెళ్లింది.<ref name="hands">చోప్రా et al. (2003), పే. 71, 76</ref>

1761నాటికి మరాఠాల ముప్పు తొలగిపోయింది, 1763నాటికి హైదర్ అలీ కెలాడీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు, బిల్గీ, బిద్నూర్ మరియు గుత్తి రాజులపై కూడా విజయం సాధించారు, దక్షిణంవైపు మలబార్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, 1766లో అలవోకగా జామోరిన్ రాజధాని కాలికట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు, మైసూర్ రాజ్యాన్ని ధార్వాడ్ వరకు మరియు ఉత్తరాన [[బళ్లారి|బళ్లారి]] వరకు విస్తరించారు.<ref name="dharwad">చోప్రా et al. (2003), పే. 55</ref><ref name="dhar">కామత్ (2001), పే. 232</ref> ఆపై ఉపఖండంలో మైసూర్ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది, ఎటువంటి ప్రాచుర్యంలేని స్థితి నుంచి ఒక్కసారిగా హైదర్ బలీయ శక్తిగా ఎదగడం మరియు ఆయన ధిక్కరణ భారత ఉపఖండంపై బ్రిటీష్‌వారు పూర్తి పెత్తనం సాధించేందుకు మిగిలిన చివరి సవాళ్లలో ఒకటిగా నిలిచాయి - బ్రిటీష్‌వారు హైదర్ అలీ నుంచి ఎదురైన ఈ సవాలును అధిగమించేందుకు మూడు దశాబ్దాల సమయం పట్టింది.<ref name="overcome">చోప్రా et al. (2003), పే. 71</ref>

హైదర్ అలీ మరింత బలీయమైన శక్తిగా మారకుండా అడ్డుకునేందుకు, బ్రిటీష్‌వారు మరాఠాలు మరియు గోల్కొండ [[నిజాం|నిజామ్‌]]తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, 1767లో జరిగిన మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఈ భాగస్వామ్యంతోనే బ్రిటీష్‌వారు పోరాడారు. సంఖ్యాపరమైన ఆధిపత్యం సాధించినప్పటికీ, హైదర్ అలీ చెంఘామ్ మరియు తిరువన్నామళై యుద్ధాల్లో పరాజయం పాలైయ్యారు. హైదర్ అలీ వ్యూహాత్మకంగా మద్రాస్ (ఆధునిక చెన్నై)కు ఐదు మైళ్ల దూరం వరకు తన సైన్యాన్ని తరలించే వరకు బ్రిటీష్‌వారు ఆయన శాంతి చర్చల ప్రస్తావనను విస్మరించారు, చివరకు ఆయన ఈ వ్యూహం ద్వారా విజయవంతంగా బ్రిటీష్‌వారితో శాంతి కుదుర్చుకున్నారు.<ref name="Venkata Ramanappa 1975 p. 207"></ref /><ref name="dhar"></ref /><ref name="peace">చోప్రా et al. (2003), పే. 73</ref> 1770లో మాధవరావు పేష్వా యొక్క మరాఠా సైన్యం మైసూర్‌ను ఆక్రమించుకుంది (1764 మరియు 1772 మధ్యకాలంలో మాధవరావు మరియు హైదర్ అలీ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి, వీటిలో హైదర్ పరాజయం పాలైయ్యారు), 1769 ఒప్పందంలో భాగంగా హైదర్ ఈ యుద్ధాల్లో బ్రిటీష్‌వారి మద్దతు అందుతుందని ఆశించారు, అయితే ఈ పోరుకు దూరంగా ఉండటం ద్వారా బ్రిటీష్‌వారు హైదర్‌ను మోసగించారు. బ్రిటీష్‌వారు చేసిన మోసం మరియు తరువాత తనకు ఎదురైన పరాజయాలు ఫలితంగా బ్రిటీష్‌వారిపై హైదర్ తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నారు - ఈ ద్వేషాన్నే ఆయన కుమారుడు కూడా పంచుకున్నారు, తరువాతి మూడు దశాబ్దాల్లో జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలకు ఈ పగే ప్రధాన కారణంగా ఉంది.

1779లో హైదర్ అలీ ఆధునిక తమిళనాడు మరియు దక్షిణాన [[కేరళ|కేరళ]]లోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు, తద్వారా రాజ్యం యొక్క వైశాల్యాన్ని సుమారుగా 80,000 మై² (205,000 కిమీ²)కు పెంచారు.<ref name="dhar"></ref /> 1780లో ఫ్రెంచ్‌వారితో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మరాఠాలు మరియు నిజామ్‌తో శాంతి కుదుర్చుకున్నారు.<ref name="autogenerated1">చోప్రా et al. (2003), పే. 74</ref> అయితే హైదర్ అలీని మరాఠాలు మరియు నిజామ్ మోసగించారు, వీరు బ్రిటీష్‌వారితో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జులై 1779లో హైదర్ అలీ 80,000 మందితో కూడిన తన సైన్యంతో కర్ణాటకను ఆక్రమించుకున్నారు, ఈ సైన్యంలో ఎక్కువగా అశ్వదళం ఉంది, మంటల్లో భగ్గుమంటున్న గ్రామాల నడుమన కనుమల గుండా కిందివైపుకు వెళ్లి ఉత్తర ఆర్కాట్‌లోని బ్రిటీష్‌వారి(contracted; show full)దు ప్రత్యర్థి మరణాలతో ఈ యుద్ధంలో సర్ ఐర్ కూట్ విజయం సాధించారు, భారతదేశంలో బ్రిటీష్‌‍వారు సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది. ఆగస్టు 27న పొల్లిలూర్ (బ్రిటీష్ సైన్యంపై హైదర్ ప్రారంభ విజయం ఇక్కడే సాధించారు) వద్ద హోరాహోరీగా సాగిన మరో యుద్ధంలో బ్రిటీష్‌వారు మరో విజయాన్ని దక్కించుకున్నారు, ఒక నెల తరువాత షోలింగూర్ వద్ద మైసూర్ సైన్యాన్ని బ్రిటీష్‌వారు వెనక్కు తప్పికొట్టారు. డిసెంబరు 7, 1782న హైదర్ అలీ మరణించారు, అప్పటికీ బ్రిటీష్‌వారితో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తరువాత ఆయన కుమారుడు [[టిప్పు
 సుల్తాన్|టిప్పు సుల్తాన్]] అధికారంలోకి వచ్చారు, బిదనూర్ మరియు మంగళూరును తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా టిప్పు సుల్తాన్ కూడా బ్రిటీష్‌వారిపై యుద్ధాలు కొనసాగించారు.<ref name="dhar"></ref /><ref name="host1">చోప్రా et al. 2003, పే. 75</ref>

1783 వరకు బ్రిటీష్ సామ్రాజ్యం లేదా మైసూర్ రాజ్యానికి ఎవరికీ స్పష్టమైన సంపూర్ణ విజయం లభించలేదు. ఐరోపాలో శాంతి ఒప్పందం కుదిరిన ఫలితంగా మైసూర్ రాజ్యానికి ఫ్రెంచ్‌వారు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు.<ref>వెంకట రామనప్ప, M. N. (1975), పే 211</ref> మైసూర్ పులిగా కీర్తించబడే టిప్పు సుల్తాన్ అయినప్పటికీ ఏమాత్రం భయపడలేదు, బ్రిటీష్‌వారిపై యుద్ధాన్ని కొనసాగించారు, అయితే ఆధునిక తీరప్రాంత కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను బ్రిటీష్‌వారికి కోల్పోయారు. ఆయన తరువాత కిట్టూర్, నార్గుండ్ మరియు [[వాతాపి|బదామీ]] భూభాగాలను మరాఠాలకు కోల్పోయారు. 1784లో మంగళూరు ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా బ్రిటీష్‌వారితో పోరుకు తాత్కాలిక మరియు సుఖశాంతులులేని విరామం లభించింది. ఇతరుల భూభాగాల్లో యుద్ధానికి ముందు స్థితి పునరుద్ధరించబడింది.<ref name="surrender"></ref /><ref name="surrender1">చోప్రా et al. (2003), పే. 75–76</ref> భారతదేశ చరిత్రలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన పత్రంగా గుర్తింపు పొందింది, ఒక భారతీయ రాజ్యం బ్రిటీష్‌వారికి నిబంధనలను నిర్దేశించిన చివరి ఒప్పంద పత్రం ఇదే కావడం గమనార్హం, శాంతి కోసం దీనిలో బ్రిటీష్‌వారు వినయపూర్వకమైన సరఫరాదారుల పాత్రను మాత్రమే పోషించాలని నిర్దేశించబడింది. బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య ఐరోపాలో తాజాగా యుద్ధాలు మొదలు కావడంతో, టిప్పు సుల్తాన్ తన ఒప్పందం నుంచి బయటకు వచ్చేందుకు సమంజసమైన కారణం లభించింది, అంతేకాకుండా బ్రిటీష్‌వారిపై దాడి చేయాలనే తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దీనిని ఆయన అవకాశంగా భావించారు.<ref name="strike">చోప్రా et al. (2003), పే. 77</ref> నిజాం, మరాఠాలు, ఫ్రెంచ్‌వారు మరియు టర్కీ రాజుతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు టిప్పు సుల్తాన్ ప్రయత్నించారు, అయితే ఈ ప్రయత్నాల ద్వారా ఆయనకు ఎటువంటి ప్రత్యక్ష సైనిక సాయం లభించలేదు.<ref name="strike"></ref />

1789లో బ్రిటీష్‌వారి మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్‌ను స్వాధీనం చేసునేందుకు టిప్పు విఫలయత్నం చేశారు, ఈ పరాజయాన్ని టిప్పు సుల్తాన్ జీర్ణించుకోలేకపోయారు, అతి పరిమిత సంఖ్యలో ఉన్న ప్రత్యర్థి సైన్యం నుంచి ఎదురైన కాల్పులతో టిప్పు సైన్యం భయభ్రాంతులకు గురైంది, దీని ఫలితంగా మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలో బ్రిటీష్‌వారికి విజయాలు దక్కాయి, వారికి [[కోయంబత్తూరు|కోయంబత్తూరు]] జిల్లా స్వాధీనమైంది, అయితే టిప్పు ప్రతిదాడిలో వారు స్వాధీనం చేసుకున్న అనేక భూభాగాలను కోల్పోయారు. 1792లో వాయువ్యం నుంచి దాడి చేసిన మరాఠాలు మరియు ఈశాన్యంవైపు నుంచి దాడికి సైన్యాన్ని పంపిన నైజాం సాయంతో లార్డ్ కార్న్‌వాలిస్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం విజయవంతంగా శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకుంది, దీంతో టిప్పు సుల్తాన్ పరాజయం పాలైయ్యారు, ఆపై శ్రీరంగపట్నం ఒప్పందం కుదిరింది. మైసూర్ రాజ్యంలో సగ భాగాన్ని మిత్రరాజ్యాలకు పంచిపెట్టారు, ఆయన ఇద్దరు కుమారులను విడిపించేందుకు ధనం చెల్లించాల్సి వచ్చింది.<ref name=&q(contracted; show full)

===రాచరిక రాష్ట్రం===
టిప్పు పతనం తరువాత, మైసూర్ రాజ్యంలో ఒక భాగాన్ని స్వాధీనం చేసుకుని, [[మద్రాస్ ప్రెసిడెన్సీ]] మరియు [[నిజాం]] మధ్య పంచారు. నిజాంకు నేటి కడప, కర్నూలు జిల్లాలను పంచినట్టే పంచి క్రీ.శ.1800లో సైన్యఖర్చుల బాకీల కింద తిరిగి ఈస్టిండియావారే మద్రాస్ ప్రెసిడెన్సీలోకి జమకట్టుకున్నారు<ref name="కథలు గాథలు"
>{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref/>. దీని ప్రకారం మిగిలిన భూభాగాన్ని ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్)గా మార్చారు; వడయార్ కుటుంబంలోని ఐదేళ్ల వారసుడు కృష్ణరాజ IIIను సింహాసనాన్ని అధిష్టించే రాజుగా ఎంపిక చేశారు, గతంలో టిప్పు కింద పని చేసిన పూర్ణయ్యను ముఖ్యమంత్రి (''దివాన్'' ) గా నియమించారు, రెజెంట్ మరియు లెప్టినెంట్ కల్నల్ బ్యారీ క్లోజ్ బ్రిటీష్ పాలకుడిగా పాలనా పగ్గాలు చేపట్టారు. మైసూర్ రాజ్యం యొక్క విదేశాంగ విధానం బ్రిటీష్‌వారి చేతుల్లోకి వెళ్లడంతోపాటు, మైసూర్‌లో ఒక బ్రిటీష్ దళాన్ని నిర్వహించేందుకు ఒక వార్షిక కప్ప(contracted; show full)మైసూర్‌లో బ్రిటీష్‌వారి ప్రతినిధి ఏ.హెచ్. కోల్ ఆరోపించినట్లుగా ఎటువంటి ఆర్థికపరమైన అవకతవకలు జరగలేదని మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో 1825లో జరిపిన ఒక వ్యక్తిగత దర్యాప్తులో గుర్తించినప్పటికీ, దశాబ్దం చివరి సమయానికి పెల్లుబికిన పౌర తిరుగుబాటు పరిస్థితులను గణనీయంగా మార్చివేసింది. 1831లో తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకునే దశలో తప్పుడు పరిపాలన నెపంతో బ్రిటీష్‌వారు ఈ రాచరిక రాష్ట్రాన్ని తమ ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకున్నారు.<ref name="mal">కామత్ (2001), పే. 250</ref><ref name="mal"
></ref /><ref>వెంకట రామనప్ప, M. N. (1975), పేజీలు. 229-231</ref> తరువాతి యాభై సంవత్సరాలపాటు, మైసూర్ బ్రిటీష్ కమిషనర్‌ల పాలనలో ఉంది; మంచి పాలకుడిగా పేరొందిన సర్ మార్క్ కుబ్బాన్ 1834 నుంచి 1861 వరకు పాలించారు, మైసూర్‌ను బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన సమర్థవంతమైన మరియు విజయవంతమైన పాలనా యంత్రాంగాన్ని ఆయన ఏర్పాటు చేశారు.<ref>వెంకట రామనప్ప, M. N. (1975), పేజీలు. 231-232</ref> ఇదిలా ఉంటే, 1876-77లో, బ్రిటీష్ ప్రత్యక్ష పాలన ముగింపు సమయానికి మైసూర్ తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకుంద(contracted; show full)

==మైసూర్ రాజ్య పరిపాలన==
[[File:Anglo-Mysore War 4.png|thumb|మైసూర్: పతన దశ, 1792–1799]]
[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] యొక్క పాలన సందర్భంగా (1399-1565) మైసూర్ భూభాగంలో పాలనా వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మంచి వ్యవస్థీకృత మరియు స్వతంత్ర పరిపాలనకు సంబంధించిన సంకేతాలు రాజా వడయార్ I హయాం నుంచి కనిపించాయి, ఆయన ''రైతు'' ల పక్షపాతిగా ఉండేవారని తెలుస్తోంది, తన హయాంలో రైతులను పన్నుల పెంపు నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.<ref name="ranadulla"
></ref /> ముందుకాలపు విజయనగర సామ్రాజ్యంలో చెలామణిలో ఉన్నవాటిని పోలిన బంగారు నాణేలను (''కాంతీరయి ఫణం'' ) ఈ రాజ్యం తమ భూభాగంలో విడుదల చేసినట్లు మొట్టమొదటి ఆధారాలు నరసరాజ వడయార్ పాలనలో లభించాయి.<ref name="phanam">కామత్ (2001), పే 228; వెంకట రామనప్ప, M. N. (1975), పే. 201</ref>

చిక్క దేవరాజా హయాంలో అనేక సంస్కరణలు అమలు చేయబడ్డాయి. రాజ్యం యొక్క పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అంతర్గత పరిపాలనలో మార్పులు చేయబడ్డాయి, తద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారింది. ఒక తపాలా వ్యవస్థ ఆచరణలోకి వచ్చింది. సమాజంలో మరింత మందికి చేరువయ్యే ఆర్థిక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ప్రత్యక్ష పన్నుల స్థానంలో అనేక సూక్ష్మ పన్నులు విధించారు, దీని ఫలితంగా భూమి పన్ను రూపంలో రైతులు మరింత ధనం చెల్లించాల్సి వచ్చింది.<ref>వెంకట రామనప్ప, M. N. (1975), పే.203</ref> కోశాగారంలోకి వచ్చే రోజువారీ ఆదాయం 90,000,000 ''పగోడా'' (ఒక నగదు ప్రమాణం)లో రాజు వ్యక్తిగత వాటాను తీసుకునేవారు- దీనిలో ఆయన తన వాటా కింద "తొమ్మిది [[కోటి|కోట్ల]] నారాయణా"ల మొత్తం (''నవకోటి నారాయణ'' ) తీసుకుంటారు. 1700లో ఔరంగజేబు దర్బారుకు రాజు ఒక దౌత్య బృందాన్ని పంపారు, ఈ సందర్భంగా రాజుకు ఔరంగజేబు ''జుగ్ దేవ రాజా'' అనే పట్టాన్ని ప్రదానం చేశారు, అంతేకాకుండా దంతపు సింహాసనంపై కూర్చునేందుకు అనుమతించారు. దీని తరువాత, ఆయన జిల్లా కార్యాలయాలు (''అట్టారా కచేరీ'' ), పద్దెనిమిది విభాగాలతో కూడిన కేంద్ర సచివాలయాన్ని స్థాపించారు, ఆయన పాలనా యంత్రాంగం మొఘల్ వారి రూపంలోకి మార్చబడింది.<ref name="sec">కామత్ (2001), పేజీలు 228–229; వెంకట రామనప్ప, M. N. (1975), పే. 203</ref>

[[హైదర్ అలీ|హైదర్ అలీ]] పాలనా కాలంలో, రాజ్యాన్ని సమానమైన భూభాగాలు ఉన్న ఐదు రాష్ట్రాలు (''అసోఫీస్'' )గా విభజించబడింది, వీటిలో మొత్తంమీద 121 తాలూకాలు (''పరగణాలు'' ) ఉన్నాయి.<ref name="british">కామత్ (2001), పే. 233</ref> [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాన్]] ''నిజమైన'' పాలకుడిగా బాధ్యతలు చేపట్టే సమయానికి {{convert|160000|km²|0|abbr=on}} (62,000 మై²) వైశాల్యానికి రాజ్యం విస్తరించింది, దీనిని 37 ప్రావీన్స్‌లుగా విభజించారు, దీనిలో మొత్తం 124 తాలూకాలు (''అమీల్'' ) ఉన్నాయి. ప్రతి ప్రావీన్స్‌కు ఒక గవర్నర్ (''అసోఫ్'' ) మరియు ఒక డిప్యూటీ గవర్నర్ ఉండేవారు. ప్రతి తాలూకాకు ''అమీల్‌దార్'' అని పిలిచే ఒక అధిపతి మరియు ప్రతి గ్రామ సమూహానికి ''పటేల్'' అనే ఒక అధిపతి ఉండేవారు.<ref name="install"></ref /> కేంద్ర పాలనా యంత్రాంగంలో ఆరు విభాగాలు ఉంటాయి, వీటికి మంత్రులు అధిపతులుగా ఉండేవారు, ప్రతి విభాగానికి నలుగురు సభ్యులతో కూడిన ఒక సలహా మండలి సహకరిస్తుంది.<ref name="zum">కామత్ (2001), పే. 235</ref>

1831లో బ్రిటీష్‌వారి ప్రత్యక్ష పాలనలోకి వచ్చి రాచరిక రాష్ట్రంగా మారిన తరువాత ప్రారంభ కమిషనర్‌లుగా లూషింగ్టన్, బ్రిగ్స్ మరియు మోరిసన్ పని చేశారు, వీరి తరువాత మార్క్ కుబ్బాన్ బాధ్యతలు చేపట్టారు, కుబ్బాన్ 1834లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.<ref name="blore">కామత్ (2001), పే. 251</ref> ఆయన [[బెంగుళూరు|బెంగళూరు]]ను రాజధానిగా చేశారు, రాచరిక రాష్ట్రాన్ని నాలుగు డివిజన్‌లుగా విభజించారు, ప్రతి డివిజన్‌కు ఒక బ్రిటీష్ సూపరిండెంట్ ఉంటారు. రాష్ట్రాన్ని ఆపై 85 తాలూకా కోర్టులతో 120 తాలూకాలుగా ఉప విభజన చేశారు, దిగువ స్థాయి పాలన మొత్తం కన్నడ భాషలో జరిగేది.<ref name="blore"></ref /> కమిషనర్ కార్యాలయంలో ఎనిమిది శాఖలు ఉంటాయి; అవి రెవెన్యూ, తపాలా, పోలీస్, అశ్విక దళం, ప్రజా పనులు, వైద్య, జంతు సంరక్షణ, న్యాయ మరియు విద్యా శాఖలు. అత్యున్నత స్థాయిలో కమిషనర్ కోర్టుతో న్యాయవ్యవస్థలో అధికార క్రమం ఉంటుంది, కమిషనర్ కోర్టు కింద ''హుజూర్ అదాలత్'' , నాలుగు సూపరింటెండింగ్ కోర్టులు మరియు దిగువ స్థాయిలో ఎనిమిది ''సదర్ మున్సిఫ్'' కోర్టులు ఉంటాయి.<ref name="adalat">కామత్ (2001), పే. 252</ref> 1862లో లెవిన్ బౌరింగ్ ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు, 1870 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగారు. ఈ కాలంలో ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టం, భారత శిక్షా స్మృతి మరియు నేర విచారణ ప్రక్రియ నిబంధన అమల్లోకి వచ్చాయి, న్యాయ వ్యవస్థను పాలనా యంత్రాంగం యొక్క కార్యనిర్వాహక భాగాల నుంచి వేరు చేశారు.<ref name="adalat"></ref />

అప్పగింత తరువాత, [[చెన్నై|చెన్నై]]కు చెందిన రంగాచార్లును దివాన్‌గా చేశారు. ఆయన హయాంలో, 1881లో 144 మంది సభ్యులతో బ్రిటీష్ ఇండియాలో మొట్టమొదటి ప్రతినిధుల సభ ఏర్పాటయింది.<ref name="ranga">కామత్ (2001), పే. 254</ref> ఆయన తరువాత 1883లో శేషాద్రి బాధ్యతలు చేపట్టారు, ఆయన హయాంలోనే కోలార్ బంగారు గనుల్లో బంగారం త్రవ్వకం మొదలైంది, శివసముద్రం జలవిద్యుత్ ప్రాజెక్టు 1899లో ప్రారంభమైంది (భారతదేశంలో ఈ దిశగా జరిగిన మొదటి ప్రధాన ప్రయత్నం ఇదే కావడం గమనార్హం), బెంగళూరుకు విద్యుత్ మరియు త్రాగునీరు (తరువాత పైపుల ద్వారా) సరఫరా చేయబడింది.<ref name="iyer">కామత్ (2001), పేజీలు. 254–255</ref> శేషాద్రి అయ్యర్ తరువాత బాధ్యతలు చేపట్టిన పి.ఎన్. కృష్ణమూర్తి 1905లో రికార్డులు నిర్వహించేందుకు సచివాలయ పుస్తకాన్నిఏర్పాటు చేయడంతోపాటు, కో-ఆపరేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు,<ref name="iyer"></ref /> ఆయన తరువాత బాధ్యతలు చేపట్టిన వి.పి. మాధవరావు అడవుల పరిరక్షణపై దృష్టి పెట్టారు, తరువాత టి. ఆనందరావు కన్నంబేడి జలాశయ ప్రాజెక్టును ఖరారు చేశారు.<ref name="dam">కామత్ (2001), పే. 257</ref>

ఆధునిక మైసూర్ రూపకర్తగా ప్రసిద్ధి చెందిన [[సర్]] [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య|ఎం.విశ్వేశ్వరయ్య]] కర్ణాటక చరిత్రలో ముఖ్య స్థానాన్ని పొందారు.<ref name="make">కామత్ (2001), పే. 259</ref> ఇంజనీర్‌గా విద్యావంతుడైన విశ్వేశ్వరయ్య 1909లో దివాన్‌గా బాధ్యతలు చేపట్టారు.<ref name="dam"></ref /><ref name="becamediwan">ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (2003), పే.139</ref> ఆయన హయాంలో మైసూర్ చట్ట సభలో సభ్యుల సంఖ్య 18 నుంచి 24కు పెంచారు, దీనికి రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలు జరిపే అధికారాన్ని కల్పించారు.<ref name="dam"></ref /> మైసూర్ ఆర్థిక సదస్సును మూడు కమిటీలుగా విస్తరించారు; అవి పరిశ్రమ మరియు వాణిజ్యం, విద్య మరియు వ్యవసాయం, వీటికి ఆంగ్లం మరియు కన్నడ భాషల్లో ప్రచురణలు ఉన్నాయి.<ref name="vis10">కామత్ (2001), పే 258</ref> ఆయన హయాంలో ప్రారంభమైన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కన్నంబాడీ జలాశయ నిర్మాణం ఒకటి, అంతేకాకుండా భద్రావతిలో మైసూర్ ఐరన్ వర్క్స్ ఏర్పాటు, 1916లో మైసూర్ విశ్వవిద్యాలయం స్థాపన, బెంగళూరులో యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపన, మైసూర్ రాష్ట్ర రైల్వే విభాగాన్ని ఏర్పాటు చేయడం మరియు మైసూర్‌లో అనేక ఇతర పరిశ్రమల స్థాపన ఆయన హయాంలోనే జరిగాయి. 1955లో ఆయనకు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన [[భారతరత్న|భారత రత్న]] అవార్డు లభించింది<ref name="vis10"></ref /><ref name="ratna">ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (2003), పేజీలు.139–140</ref>

1926లో సర్ మీర్జా ఇస్మాయిల్ దివానుగా బాధ్యతలు స్వీకరించి ముందువారు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేశారు. భద్రావతి ఐరన్ వర్క్స్‌ను విస్తరించడం, భద్రావతిలో సిమెంట్ మరియు కాగిత కర్మాగారాన్ని స్థాపించడం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థాపన ఆయన హయాంలో జరిగాయి. ఉద్యానవనాలపై ఎంతో మక్కువ కనబర్చిన ఆయన బృందావన్ గార్డెన్స్ (కృష్ణరాజ సాగర్)ను నిర్మించడంతోపాటు, ఆధునిక మాండ్య జిల్లాలో {{convert|120000|acr(contracted; show full)">శాస్త్రి (1955), పే. 297–298</ref> భూమిలేని కూలీలు అందుబాటులో ఉండటంతో రాజులు మరియు భూస్వాములు రాజ భవనాలు, ఆలయాలు, మసీదులు, జలాశయాలు మరియు చెరువుల వంటి నిర్మాణాలు చేపట్టారు.<ref name="tank">చోప్రా et al. (2003), పే. 123</ref> భూమి అపారంగా అందుబాటులో ఉండటం, జనాభా అతి తక్కువగా ఉండటం వలన భూమి యజమాని వద్ద ఎటువంటి కౌలు వసూలు చేసేవారు కాదు. దీనికి బదులుగా, భూమి యజమానులు పంటసాగుకు పన్ను చెల్లించేవారు, మొత్తం పంటలో సగ భాగం వరకు పన్నుగా తీసుకునేవారు.<ref name="tank"
></ref />

టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో వివిధ ప్రదేశంలో ప్రభుత్వ వ్యాపార గోదాములను స్థాపించారు. అంతేకాకుండా, [[కరాచీ|కరాచీ]], జెడ్డా మరియు [[మస్కట్|మస్కట్]] వంటి విదేశీ ప్రాంతాల్లో కూడా టిప్పు సుల్తాన్ గోదాములను ఏర్పాటు చేశారు, వీటిలో మైసూర్ ఉత్పత్తులు విక్రయించబడేవి.<ref name="muscat">కామత్ లో M.H.గోపాల్ 2001, పే.235</ref> టిప్పు సుల్తాన్ హయాంలో మొట్టమొదటిసారి వడ్రంగి మరియు లోహ పనులకు ఫ్రెంచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు చెరుకు సాగుకు చైనీస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది, పట్టు పురుగుల పెంపక పరిశ్రమలో [[బెంగాల్|బెంగాల్]] పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో మెరుగైన ఫలితాలు సాధ్యపడ్డాయి.<ref name="seri">కామత్ (2001), పేజీలు. 235–236</ref> కనకపురా మరియు తారామండల్‌పేట్ ప్రదేశాల్లో వరుసగా ఫిరంగులు మరియు తుపాకీ మందు తయారీ కోసం ప్రభుత్వ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. చక్కెర, ఉప్పు, ఇనుము, మిరియాలు, ఏలకులు, వక్క, పొగాకు మరియు [[ఎర్రచందనం|చందనం]] వంటి నిత్యావసరాల ఉత్పత్తిలో ప్రభుత్వం గుత్తాధిపత్యం కలిగివుండేది, అంతేకాకుండా చందనం చెట్ల నుంచి సుగంధ నూనెను తీయడం మరియు వెండి, బంగారం మరియు విలువైన రాళ్ల త్రవ్వకాలు కూడా ప్రభు(contracted; show full)రాయపడ్డారు.<ref name="srivai">కామత్ (2001), పే. 229</ref> చరిత్రకారుడు అయ్యంగార్ వాదన ప్రకారం ప్రసిద్ధి చెందిన నరసరాజా I మరియు చిక్క దేవరాజలతోపాటు కొందరు రాజులు వైష్ణవులు, అయితే అందరు వడయార్ పాలకులు వైష్ణవులు కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.<ref name="wod-rule">ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పే.304</ref> దక్షిణ భారతదేశ సాంస్కృతిక కేంద్రంగా ఆధునిక రోజు మైసూర్ నగరం అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఆధారాలను వారు సార్వభౌమత్వం పొందిన కాలంలో గుర్తించారు.<ref name="c
entrehikka">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> రాజా వడయార్ I మైసూర్‌లో దసరా వేడుకలు నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు, వీరికి ముందు విజయనగర రాజ కుటుంబం కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేది.<ref name="chikka"/><ref name="das">ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పే. 290</ref><ref name="das10">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref>

మధ్యయుగం చివరి కాలంలో జైన మతం క్షీణించినప్పటికీ, మైసూర్ రాజులు ఈ మతానికి పోషకులుగా ఉన్నారు, మైసూర్ రాజులు శ్రావణబెళగోలా పట్టణంలో జైన సన్యాస కేంద్రాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.<ref name="shrav">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</refchikka"/><ref name="lak1">కామత్ (2001), పేజీలు. 229–230</ref> శ్రావణబెళగోలాలో ముఖ్యమైన జైన మత కార్యక్రమం అయిన ''మహామస్తకాభిషేకం'' వేడుకలో కొందరు వడయార్ రాజులు పాల్గొనడంతోపాటు, 1659, 1677, 1800, 1825, 1910, 1925, 1940, మరియు 1953 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా ''పూజ'' లు కూడా నిర్వహించారు.<ref name="puja">సింగ్ (2001), పేజీలు. 5782–5787</ref>

దక్షిణ భారతదేశం మరియు [[ఇస్లాం మతం|ఇస్లాం]] మధ్య సంబంధాలు 7వ శతాబ్దం నుంచి ఉన్నాయి, ఈ సమయంలోనే హిందూ సామ్రాజ్యాలు మరియు ఇస్లామిక్ [[ఖిలాఫత్]] ల మధ్య వ్యాపార సంబంధాలు బాగా వృద్ధి చెందాయి. ఈ ముస్లిం వ్యాపారులు మలబార్ తీరంలో స్థిరపడి, స్థానిక హిందూ మహిళలను వివాహం చేసుకున్నారు, వీరి వారసులు ''మాపిలాస్‌'' గా గుర్తింపు పొందారు.<ref name="map">శాస్త్రి (1955), పే.396</ref> 14వ శతాబ్దం సమయానికి ముస్లింలు దక్షిణ భారతదేశంలో గణనీయమైన మైనారిటీ వర్గంగా మారింది, పోర్చుగీసు మిషనరీల రాకతో వారి వృద్ధి నిలిచిపోయింది.<ref name="map"></ref /> ముస్లిం మతస్తుడైనప్పటికీ హైదర్ అలీ తాను పాలిస్తున్న ఈ హిందూ రాజ్య పాలనా వ్యవహారాల్లో తన మత విశ్వాసాల జోక్యాన్ని అనుమతించలేదు. ఇదిలా ఉంటే చరిత్రకారులు హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ యొక్క ఉద్దేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టిప్పు హిందువులకు తన పాలనా యంత్రాంగంలో ఉన్నత స్థానాలు కల్పించారని తెలుస్తోంది, హిందూ ఆలయాలకు మరియు బ్రాహ్మణులకు ఉదారంగా విరాళాలు ఇచ్చినట్లు మరియు ఇతర మత విశ్వాసాలను గౌరవించినట్లు చెబుతున్నారు, అయితే ఆయన హయాంలో జరిగిన మత మార్పిళ్లు తన అధికారంపై తిరుగుబాటు చేసినవారికి(contracted; show full)దించిన వివరాల ప్రకారం, సమాజంలో విస్తృతంగా హిందూ కుల వ్యవస్థ ఉండేది, తొమ్మిది రోజుల వేడుకలు సందర్భంగా (''మహానవమి'' ) జంతు బలులు ఇచ్చేవారు.<ref name="maha">శాస్త్రి (1955), పే. 394</ref> తరువాత స్థానిక మరియు విదేశీ శక్తుల మధ్య పోరాటాల ఫలితంగా సైద్ధాంతిక మార్పులు సంభవించాయి. హిందూ సామ్రాజ్యాలు మరియు సుల్తానేట్‌ల మధ్య యుద్ధాలు కొనసాగినప్పటికీ, స్థానిక పాలకులు (ముస్లింలతోసహా) మరియు కొత్తగా వచ్చిన బ్రిటీష్‌వారి మధ్య పోరాటాలు ప్రధానమయ్యాయి.<ref name="british"
></ref /> ఆంగ్ల విద్య వ్యాప్తి చెందడం, ముద్రణ యంత్రం ప్రవేశపెట్టడం మరియు క్రైస్తవ మిషనరీలు స్థానిక సామాజిక వ్యవస్థపై చేసిన విమర్శల ఫలితంగా సమాజంలో పరిస్థితి మెరుగుపడింది. భారతదేశం వ్యాప్తంగా ఆధునిక జాతీయవాదం వృద్ధి చెందడం మైసూర్‌ను కూడా ప్రభావితం చేసింది.<ref name="west">కామత్ (2001), పే. 278</ref>

(contracted; show full) వ్యతిరేకంగా తిరుగుబాట్లు కూడా జరిగాయి, వీటిలో ముఖ్యమైనవి 1835నాటి కొడుగు తిరుగుబాటు (స్థానిక పాలకుడు చిక్కవీరరాజాను తొలగించిన తరువాత ఈ తిరుగుబాటు జరిగింది) మరియు 1837నాటి కనరా తిరుగుబాటు.<ref name="revolt1">కామత్ (2001), పే. 275</ref> క్రైస్తవ మిషనరీలు ప్రవేశపెట్టిన ముద్రణ యంత్రాలు ఫలితంగా రాజ్యం వ్యాప్తంగా ముద్రణ కేంద్రాలు స్థాపించబడ్డాయి. పురాతన మరియు సమకాలీన కన్నడ పుస్తకాలు (''పంపా భారత'' మరియు ''జైమినీ భారత'' వంటివి), ఒక కన్నడ-భాషా [[బైబిల్
|బైబిల్]], ఒక ద్విభాషా పదకోశం మరియు ''కన్నడ సమాచార'' అని పిలిచే ఒక కన్నడ వార్తాపత్రిక ముద్రణలు 19వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభమయ్యాయి.<ref name="press">కామత్ (2001), పేజీలు. 279–280; మూర్తి (1992), పే 168</ref> ఆలూరు వెంకటరావు కన్నడ పౌరుల సాధనల గురించి వివరిస్తూ తన యొక్క ''కర్ణాటక గాథా వైభవ'' పుస్తకంలో ఒక సమగ్ర కన్నడ చరిత్రను అందించారు.<ref name="rekindle">కామత్ (2001), పే. 281; మూర్తి (1992), పే.172</ref>

సాంప్రదాయిక ఆంగ్ల మరియు సంస్కృత నాటకాలు,<ref name="plays">మూర్తి (1992), పే. 169</ref> మరియు స్థానిక యక్షగాన నాటకాలు కన్నడ నాటక రంగాన్ని ప్రభావితం చేశాయి, గుబ్బి వీరన్న వంటి ప్రసిద్ధ నాటక కళాకారులు వీటి ద్వారా ఆవిర్భవించారు.<ref name="notedmusician">కామత్ (2001), పే. 282</ref> ప్యాలస్ మైదానంలో పబ్లిక్ అడ్రస్ వ్యవస్థల ద్వారా ప్రసారం చేయబడే కర్ణాటక సంగీతాన్ని ప్రజలు ఆస్వాదించడం మొదలుపెట్టారు.<ref name="broad">ప్రాణేష్ (2003), ప.163</ref> [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము|బెంగాల్ పునరుజ్జీవనోద్యం]] ద్వారా స్ఫూర్తి పొందిన మైసూర్ చిత్తరువులను సందరయ్య, అల సింగరయ్య మరియు బి. వెంకటప్ప తదితర కళాకారులు గీశారు.<ref name="paint">కామత్ (2001), పే. 283</ref>

===సాహిత్యం===
[[File:Intro.bmp.jpg|right|thumb|కృష్ణరాజ వడయార్ III రచించిన సంగీత గ్రంథం శ్రీతత్వనిధి మొదటి పేజి]]
[[File:FullPagadeYakshagana.jpg|upright|thumb|ఒక యక్షగాన కళాకారుడు]]
కన్నడ సాహిత్యం అభివృద్ధిలో మైసూర్ రాజ్యపాలనా కాలం ఒక ముఖ్యమైన యుగంగా ఉంది. మైసూరు ఆస్థానంలో ప్రసిద్ధ బ్రాహ్మణ మరియు వీరశైవ రచయితలు మరియు సంగీత కళాకారులతోపాటు,<ref name="lak1"></ref /><ref name="sri">నరసింహాచార్య (1988), పేజీలు. 23–27</ref> రాజులు కూడా లలిత కళల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.<ref name="kan1">ముఖర్జీ (1999), పే 78; నరసింహాచార్య (1988), పే. 23, పే. 26</ref><ref name="kan100">కామత్ (2001), పేజీలు 229–230; ప్రాణేష్ (2003), ప్రిఫేస్ చాప్టర్ p(i)</ref> తత్వ శాస్త్రం మరియు మతానికి సంబంధించిన సాంప్రదాయిక సాహిత్యం ప్రాచుర్యంలోనే ఉండగా, చారిత్రక రచన, జీవిత చరిత్ర, చరిత్ర, విజ్ఞాన సర్వస్వం, నవల, నాటక మరియు సంగీత గ్ర(contracted; show full)త్య'' ప్రమాణంలో (ఒక సంగీత పరికరాన్ని కనిపెట్టినందుకు గుర్తుగా దీనిని రాశారు), ఈ గ్రంథంలోని ఇరవై ఆరు అధ్యాయాల్లో రాజు యొక్క ఆస్థానం, జనరంజక సంగీతం మరియు ఆ కాలానికి చెందిన సంగీత కూర్పుల్లో రకాలను ప్రస్తావించారు.<ref name="kan13">రైస్ E.పే (1921), పే. 90; ముఖర్జీ (1999), పే. 119</ref><ref name="kan130">కామత్ (2001), పే 227; ప్రాణేష్ (2003), పే. 11</ref> రాజవంశంలో ప్రారంభ స్వరకర్తగా రాజు చిక్క దేవరాజా గుర్తింపు పొందుతున్నారు.<ref name="bahadur"
></ref /><ref name="chikka">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref/> ''గీతా గోపాలా'' అని పిలిచే సంగీత ప్రసిద్ధ గ్రంథం ఆయనను ఉద్దేశించి రాయబడింది. జయదేవా యొక్క సంస్కృత రచన ''గీతా గోవింద'' నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, దీనికి సొంత ప్రత్యేకత ఉంది, దీనిని ''సప్తపది'' ప్రమాణంలో రాశారు.<ref name="sapta">ముఖర్జీ (1999), పే. 78; ప్రాణేష్ (2003), పే 21</ref> కన్నడ మాట్లాడే మొత్తం ప్రాంతంపై తమదైన ముద్రవేసిన సమకాలీన రచయితల్లో బ్రాహ్మణ రచయిత లక్ష్మీసా మరియు దేశదిమ్మరి అయిన వీరశైవ రచయిత సర్వాజ్ఞ ముఖ్యులు. సాహిత్య పరిణామాల్లో మహిళా రచయితలు కూడా తమ వంతు పాత్ర పోషించారు, చెలువాంబ (కృష్ణరాజ వడయార్ I పట్టపురాణి), హెలవనకట్టే గిరియమ్మ, శ్రీ రంగమ్మ (1685) మరియు సాంచి హోన్నమ్మ (''హాదిబాడెయా ధర్మా'' , 17వ శతాబ్దం) ప్రసిద్ధ రచనలు చేశారు.<ref name="had">ముఖర్జీ (1999), పే. 143, పే 354, పే. 133, పే 135; నరసింహాచార్య (1988), పేజీలు. 24–25</ref><ref name="had1">ప్రాణేష్ (2003), పేజీలు. 33–34; రైస్ E.పే. (1921), పేజీలు. 72–73, పేజీలు. 83–88, పే. 91</ref>

బహుముఖ ప్రజ్ఞాశాలి నరసరాజా II వివిధ భాషల్లో పద్నాలుగు యక్షగానాలు రశారు, అయితే అన్నింటినీ ఆయన కన్నడ లిపిలోనే రాయడం జరిగింది.<ref name="wod">ప్రాణేష్ (2003), పేజీలు 37–38</ref> మహారాజా కృష్ణరాజా III కన్నడలో ఒక ప్రసిద్ధ రచయితగా పేరొందారు, ఇందుకుగాను ఆయనకు ''అభినవ భోజా'' (మధ్యయుగ రాజు భోజాతో పోలుస్తూ ఈ బిరుదు ఇచ్చారు) అనే గౌరవ బిరుదు లభించింది.<ref name="bhoja">[6] ^ ప్రాణేష్ (2003), పే 162</refinstru"/> ఆయన నలభైకిపైగా రచనలు చేసినట్లు తెలుస్తోంది, వీటిలో సంగీత గ్రంథం ''శ్రీ తత్వనిధి'' మరియు రెండు రూపాల్లో రాసిన ''సౌగంధికా పరిణయ'' అనే శృంగార కవిత, ఒక ''సాంగత్య'' మరియు ఒక నాటకం ప్రసిద్ధి చెందాయి.<ref name="sou">నరసింహాచార్య (1988), పే. 26; మూర్తి (1992), పే.167; ప్రాణేష్ (2003), పే. 55</ref> మహారాజా పోషణలో, కన్నడ సాహిత్యం ఆధునిక హంగులు పొందింది. కెంపు నారాయణ యొక్క ''ముద్రమంజుషా'' ("ది సీల్ కాస్కెట్", 1823) ఆధునిక గద్య భాగంతో రూపొందిన మొట్టమొదటి రచనగా గుర్తింపు పొందింది.<ref name="mudra">మూర్తి (1992), పే. 167</ref> ఇదిలా ఉంటే ముద్దన్న రాసిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన ''అద్భుత రామాయణ'' (1895) మరియు ''రామాశ్వమేధం'' (1898) బాగా ప్రాచుర్యం పొందాయి, కన్నడ అధ్యయనకారుడు నరసింహ మూర్తి ఆయనను ఆధునిక కన్నడ సాహిత్యానికి జానూస్ (సాహిత్యంతో ముడిపడిన ఒక రోమన్ దేవత)గా పరిగణించారు. ముద్దన్న ఈ పురాతన ఇతిహాసాన్ని పూర్తిగా ఆధునిక కోణంలోకి మలిచారు.<ref name="viewpoint">మూర్తి (1992), పే. 170</ref>

మైసూర్‌కు చెందిన మరియు మహారాజా కృష్ణరాజా III మరియు మహారాజా చామరాజా IX ఆస్థానంలో ప్రశస్తి గల వ్యక్తి బసవప్ప శాస్త్రి కన్నడ నాటక రంగ పితామహుడు (''కన్నడ నాటక పితామహా'' )గా ప్రసిద్ధి చెందారు.<ref name="gowritayaga">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> ఆయన [[విలియం షేక్‌స్పియర్|విలియం షేక్‌స్పియర్]] యొక్క ఓథెల్లోను ''షురసేనా చారిట్‌'' గా అనువదించడంతోపాటు, కన్నడలో నాటకాలు రాశారు. సంస్కృతం నుంచి కన్నడలోకి ఆయన అనువదించిన అనేక ప్రసిద్ధ అనువాదాల్లో ''కాళిదాసా'' , ''అభిజ్ఞాన శాకుంతలా'' తదితరాలు ఉన్నాయి.<ref name="basava">సాహిత్య అకాడమీ (1988), పే. 1077; ప్రాణేష్ (2003), పే.82</ref>

===సంగీతం===
[[File:Veena Subbanna Seshanna 1902.jpg|right|thumb|ప్రసిద్ధ వీణా విధ్వాంసులు - వీణా సుబ్బన్న మరియు వీణా శేషన్న (1902లో ఈ ఛాయాచిత్రాన్ని తీశారు)]]

మహారాజా కృష్ణరాజా III మరియు ఆయన వారసులు చామరాజా IX, కృష్ణరాజా IV మరియు చివరి పాలకుడు జయచామరాజా హయాంలో మైసూరు ఆస్థానం అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ సంగీత పోషణా కేంద్రంగా వెలుగొందింది.<ref name="Weidman 2006, p. 66">వీడ్మన్ (2006), పే.66</ref> తంజావూరు మరియు ట్రావెన్‌కోర్ ఆస్థానాలు కూడా కళాకారులకు గొప్ప సౌకర్యాలు కల్పించినప్పటికీ, కళను రక్షించడానికి కృషి చేయడం మరియు ఒక్కో సంగీత కళాకారుడికి రాజ మర్యాదలు చేయడం, ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు సంగీత పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఐరోపా సంగీత ప్రచురణకర్తలు మరియు నిర్మాతలను పోషించడం ద్వారా మైసూర్ ఆస్థానం తన ప్రత్యేకత చాటుకుంది.<ref>వీడ్మన్ (2006), పే. 65</ref> స్వయంగా సంగీత కళాకారుడు మరియు సంగీత అధ్యయనకారుడు అయిన మహారాజా కృష్ణరాజా III కన్నడ భాషలో ''అనుభవ పంచరత్న'' అనే పేరుతో అనేక ''జావలీస్'' (తేలిక పాటలు) మరియు భక్తి గీతాలు స్వరపరిచారు. ఆయన స్వరకూర్పుల్లో వడయార్ రాజ కుటుంబ దైవత "చాముండి" లేదా "చాముండేశ్వరి"కి గౌరవసూచకంగా నోమ్ డి ప్లుమ్ (''[[ముద్ర|ముద్ర]]'' ) ఉంటుంది.<ref name="krishtayaga">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> ఆయన వారసుడు చామరాజా IX 1891లో ఓరియంటల్ లైబ్రరీని స్థాపించారు, దీనిలో సంగీత గ్రంథాలు ఉంటాయి, ప్యాలస్ గ్రంథాలయం కోసం అనేక మంది సంగీత కళాకారుల యొక్క ఫోనోగ్రాఫ్ రికార్డింగ్‌లను కూడా ప్రారంభించారు.

కృష్ణరాజా IV హయాంలో కళకు మరింత పోషణ లభించింది. ''రాగా'' మరియు ''భావా'' లకు ప్రాధాన్యత ఇచ్చిన ఒక ప్రత్యేక సంగీత పాఠశాల ప్రారంభమైంది.<ref name="paint"></ref /><ref name="king">ప్రాణేష్ (2003), పే xiii ఆదర్స్ నోట్ లో  </ref><ref name="high">కామత్ (2001), పే282</ref> కళ యొక్క వ్యవస్థీకృత భోదనకు సాయపడిన రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌ను ప్యాలస్‌లో స్థాపించారు. కర్ణాటక స్వరాలు ముద్రించబడ్డాయి, రాజ సంగీత కళాకారులు ఐరోపా సంగీత సంకేతాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. పాశ్చాత్య సంగీతం కూడా ప్రోత్సహించబడింది - రాజభవనం యొక్క సంగీత బృందంతో మార్గరెట్ కజిన్స్ పియానో కార్యక్రమాన్ని బెంగళూరులో బీథోవెన్ శతాబ్ది ఉత్సవాల్లో నిర్వహించారు.<ref name="Weidman 2006, p. 66"></ref /> ప్రసిద్ధ కర్ణాటక ''కృతుల'' (ఒక సంగీత స్వరం) స్వరకర్తగా పేరొందిన మహారాజా జయచామరాజా రష్యా సంగీత కళాకారుడు నికోలస్ మెడ్నెర్ మరియు ఇతరుల యొక్క రికార్డింగ్‌లను ప్రాయోజితం చేశారు.<ref name="Weidman 2006, p. 66"></ref /> ఆస్థానం కర్ణాటక సంగీతానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ కార్యకలాపాలు నిర్వహించింది. రాజభవనం యొక్క సంగీత బృందం గ్రామోఫోన్ రికార్డింగ్‌లు తయారు చేసి, వాటిని విక్రయించింది.<ref>వీడ్మన్ (2006), పే. 67</ref> సంగీత పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారు. వివిధ పరికరాలను సేకరించేందుకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేశారు, సాంప్రదాయకంగా కాని కొమ్ములుండే వయోలిన్, థియర్మిన్ మరియు ఒక యాంత్రిక సంగీత వాయిద్యం అయిన కాలియాఫోన్‌లు కూడా సేకరణల్లో భాగంగా ఉన్నాయి.<ref>వీడ్మన్ (2006), పే.68</ref>

ఆ సమయానికి చెందిన అనేక మంది ప్రసిద్ధ విధ్వాంసులు (''విద్వాన్'' ) మైసూరు ఆస్థానంలో ఉండేవారు. ఒక ఆస్థాన సంగీత కళాకారుడు వీణా శేషన్నా మహారాజా చామరాజా IX హయాంలో ఉన్నారు,<ref name="autogenerated2tayaga">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> [[వీణ|వీణ]]ను వాయించడంలో అత్యంత గొప్ప కళాకారుల్లో ఆయన ఒకరిగా పేరొందారు.<ref name="expo">బక్షి (1996), పే.12; కామత్ (2001), పే.282</ref> శాస్త్రీయ సంగీతంలో ఆయన సాధనల ఫలితంగా వాయిద్య కర్ణాటక సంగీత కళలో మైసూర్‌కు ఒక ప్రధాన స్థానం దక్కింది, ఆయనను మహారాజా కృష్ణరాజ వడయార్ IV ''వైనిక శిఖామణి'' అనే గౌరవ బిరుదుతో సత్కరించారు.<ref name="shika">ప్రాణేష్ (2003), పేజీలు.110–111</ref><ref>{{cite web |url=http://hindu.com/thehindu/mp/2002/07/11/stories/2002071100260300.htm |title= The final adjustment |author= Satish Kamat|publisher=[[The Hindu]] |work= Metro Plus Bangalore|accessdate=2007-10-10}}</ref> మైసూర్ వాసుదేవాచార్య ఒక ప్రసిద్ధ సంగీత కళాకారుడు, మైసూర్‌లో ఆయన సంస్కృతం మరియు తెలుగు భాషల్లో స్వరాలు కూర్చారు.<ref name="vasudeva">సుబ్రమణియన్ (2006), పే.199; కామత్ (2001), పే.282</ref> ఆయన మైసూర్ రాజుల్లో నాలుగు తరాల వారి పోషణను పొందిన ఏకైక కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు, ముగ్గురు రాజుల వద్ద ఆయన ఆస్థాన సంగీత కళాకారుడిగా పని చేయడం గమనార్హం.<ref name="vasutayaga">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref><ref name="booktayaga">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> హెచ్.ఎల్. ముత్తయ్య భగవతార్ మైసూర్ ఆస్థానంలో ఉన్న మరో సంగీత స్వరకర్త.<ref name="mutiahbhagava">సుబ్రమణియన్ (2006), పే 202; కామత్ (2001), పే. 282</ref> [[త్యాగరాజు|త్యాగరాజ]] కాలం తరువాత అత్యంత ముఖ్యమైన స్వరకర్తల్లో ఆయన ఒకరిగా గుర్తించబడుతున్నారు,<ref name="tayaga">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> సంస్కృతం, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషల్లో ఆయన 400లకుపైగా స్వరాలు కూర్చారు, ఆయన కలం పేరు "హరికేశా". [[వయొలిన్|వయోలిన్]] కళాకారుల్లో టి.చౌడయ్య ఆ కాలంలో ఒక అత్యంత ప్రసిద్ధ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఏడు తీగలు ఉండే వయోలిన్‌ను ఆయన కనిపెట్టినట్లు గుర్తిస్తున్నారు.<ref name="notedmusician"></ref /><ref name="chow">ప్రాణేష్ (2003), పే. 214, 216</ref> మహారాజా కృష్ణరాజ వడయార్ IV 1939లో చౌడయ్యను ఆస్థాన సంగీత కళాకారుడిగా నియమించారు, "సంగీత రత్న" మరియు "సంగీత కళానిధి" అనే బిరుదులు పొందారు. ఆయన కన్నడ, తెలుగు మరియు సంస్కృత భాషల్లో "త్రిమకుట" అనే కలం పేరుతో స్వర రచన చేశారు.<ref name="tirucentre">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref>

==వాస్తుశిల్పం==
[[File:Chamundeshwari Temple Mysore.jpg|thumb|left|upright|చాముండి కొండపై చాముండేశ్వరి ఆలయం యొక్క గోపురం. మైసూర్ రక్షణ దేవత చాముండేశ్వరికి ఈ ఆలయాన్ని అంకితమిచ్చారు.]]

(contracted; show full)లి "పునరుజ్జీవనోద్యమ శైలి"గా పిలువబడింది, ఆంగ్ల మనోర్ హోస్‌లు మరియు ఇటాలియన్ పాలాజ్జోల వాస్తుశిల్ప కళా రీతులు దీనిలో కనిపిస్తాయి.<ref name="lalith">రామన్ (1994), పేజీలు.87–88</ref> మధ్యలో ఉండే గోపురాన్ని లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ గోపురాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించినట్లు భావిస్తారు. దీనిలో ఇతర ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఇటాలియన్ పాలరాతి మెట్ల వరస, బాంక్వెట్ మరియు నృత్య మందిరాల్లో పాలిష్ చేసిన కలప గచ్చు మరియు బెల్జియన్ కట్ గాజు దీపాలు.<ref name="lalith"
></ref /> జగన్‌మోహన్ ప్యాలస్ నిర్మాణం 1861లో ప్రారంభమై 1910లో పూర్తయింది. మూడు అంతస్తుల ఈ భవనంలో ఆకర్షణీయమై గోపురాలు, ఫినియల్‌లు మరియు కుపోలాలు ఉంటాయి, ఇది అనేక రాజ వేడుకలకు వేదికగా ఉంది. ఇప్పుడు దీనిని చామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీగా పిలుస్తున్నారు, దీనిలో అనేక కళాఖండాల సేకరణను చూడవచ్చు.<ref name="rich">రామన్ (1994), పేజీలు. 83–84, పేజీలు. 91–92</ref>

మానస గంగోత్రిగా కూడా పిలిచే మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క ప్రాంగణంలో వాస్తుశిల్పానికి సంబంధించి ఆసక్తికరమైన పలు భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఐరోపా శైలిలో ఉంటాయి, వీటి నిర్మాణం 19వ శతాబ్దం చివరి కాలంలో పూర్తయింది. వీటిలో జయలక్ష్మి విలాస్ మాన్షన్, క్రాఫోర్డ్ హాలు, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌‍స్టిట్యూట్ (1887 మరియు 1891 మధ్యకాలంలో నిర్మించారు) భవనాలు లోనిక్ మరియు కోరిన్‌థియాన్ స్తంభాలతో కనిపిస్తాయి, జిల్లా కార్యాలయాలు (''అథరా కచేరీ'' , 1887) కూడా ఆసక్తికరమైన నిర్మాణాలు. ఒకప్పుడు బ్రిటీష్ కమిషనర్ కార్యాలయంగా ఉన్న అథరా కచేరీలో ఒక అష్టభుజ గోపురం మరియు దీని అందాన్ని మరింత పెంచే ఫైనియల్ ఉంటాయి.<ref name="octogen">రామన్ (1994), పే. 84</ref> 1880లో నిర్మించిన మహారాజా వేసవి విడిది భవనాన్ని లోకరంజన్ మహల్‌గా పిలుస్తారు, ఇది మొదట రాజ వంశీయులకు పాఠశాలగా ఉండేది. చాముండి కొండపై ఇండో-బ్రిటీష్ శైలిలో ఉన్న రాజేంద్ర విలాస్ ప్యాలస్ నిర్మాణాన్ని 1922లో ప్రారంభించారు, మహారాజా కృష్ణరాజా IV 1938లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.<ref name="lalith"></ref /> మైసూర్ పాలకులు నిర్మించిన ఇతర రాజ భవనాల్లో మైసూర్‌లోని చిత్తరంజన్ మహల్ మరియు బెంగళూరులో బెంగళూర్ ప్యాలస్ ముఖ్యమైనవి, బెంగళూర్ ప్యాలస్‌ను ఇంగ్లాండ్ యొక్క విండ్సోర్ కాజిల్ స్ఫూర్తితో నిర్మించారు.<ref name="wind">బ్రాడ్నాక్ (2000), పే.294</ref> సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (చెలువాంబ మాన్షన్)ను బారోక్ యూరోపియన్ పునరుజ్జీవన శైలిలో నిర్మించారు, ఈ భవనం ఒకప్పుడు మహారాజా కృష్ణరాజ IV సోదరి, రాకుమారి చెలువంబామణి అవరు నివాసంగా ఉండేది. దీనిలో విస్తృతమైన పాలిస్టర్ అలంకరణలు మరియు మొసాయిక్ గచ్చు గమనార్హమైనవి.<ref name="baroque">రామన్ (1994), పేజీలు. 81–82</ref>

వడయార్‌లు నిర్మించిన అనేక ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన చాముండేశ్వరీ ఆలయం చాముండి కొండపై ఉంది. ప్రారంభ నిర్మాణం 12వ శతాబ్దంలో జరిగింది, తరువాత ఈ ఆలయానికి మైసూర్ పాలకులు పోషకులుగా మారారు. మహారాజా కృష్ణరాజా III 1827లో ఈ ఆలయంలో ద్రావిడ-శైలి గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి దేవతల చిత్రాలు ఉన్న వెండి-ఫలకాలతో తలుపులు ఉంటాయి. ఇతర చిత్రాల్లో హిందూ దేవుడు [[వినాయకుడు|వినాయకుడు]] మరియు మహారాజా కృష్ణరాజా III తన ముగ్గురు రాణులతో ఉంటారు.<ref name="hill">రామన్ (1994), పే. 85</ref> మైసూర్‌లో ప్రధాన ప్యాలస్ పరిసరాల్లో మరియు కోట లోపల ఐదు ఆలయాలు ఉన్నాయి, వీటిని వివిధ కాలాల్లో నిర్మించారు. అవి ప్రసన్న కృష్ణస్వామి ఆలయం (1829), లక్ష్మీరమణ స్వామి ఆలయం (ఈ ఆలయం యొక్క ప్రారంభ నిర్మాణం 1499లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి), త్రినేశ్వర స్వామి ఆలయం (16వ శతాబ్దం), హోయసాలా శైలి వాస్తుశిల్పంతో పూర్ణయ్య నిర్మించిన శ్వేత వరాహ స్వామి ఆలయం, ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం (1836, ఈ ఆలయంలో (contracted; show full)

==సైనిక పరిజ్ఞానం==
మొట్టమొదటి [[ఇనుము|ఇనుప]]-కేస్ గల మరియు లోహ-స్తంభంతో నిర్మించిన రాకెట్ ఫిరంగి దళాన్ని మైసూర్ రాజ్యాన్ని పాలించిన ముస్లిం రాజ [[టిప్పు
 సుల్తాన్|టిప్పు సుల్తాన్]] మరియు ఆయన తండ్రి [[హైదర్ అలీ|హైదర్ అలీ]] 1780వ దశకంలో అభివృద్ధి చేశారు. ఆంగ్లో-మైసూర్ యుద్ధాల సందర్భంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అతిపెద్ద సైనిక బలంపై ఆయన విజయవంతంగా లోహ-స్తంభం గల [[రాకెట్|రాకెట్‌]]లను ఉపయోగించారు. బ్రిటీష్‌వారు ఉపయోగించేవాటి కంటే [[మైసూరు|మైసూర్]] రాకెట్‌లు ఈ కాలంలో అత్యంత అధునాతనమైనవిగా గుర్తింపు పొందాయి, ముఖ్యంగా పేలుడు పదార్థాన్ని ఉంచేందుకు ఇనుప గొట్టాలు ఉపయోగించడం ద్వారా ఇవి సమర్థవంతమైనవిగా పేరొందాయి; దీని ద్వారా అధిక పీడనం మరియు సుదూర ప్రదేశాలపై క్షిపణి దాడులు చేయడం ({{convert|2|km|0|abbr=on}} దూరం వరకు) సాధ్యపడింది. నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ చివరకు పరాజయం చవిచూసిన తరువాత మైసూర్ ఇనుప రాకెట్‌లను బ్రిటీష్‌వారు స్వాధీనం చేసుకున్నారు, బ్రిటీష్ రాకెట్ అభివృద్ధిలో ఇవి ప్రభావం చూపాయి, కాంగ్రెవ్ రాకెట్‌ల నిర్మాణానికి ఇవి స్ఫూర్తిగా నిలిచాయి, వీటిని ఆ వెంటనే నెపోలియన్ యుద్ధాల్లో ఉపయోగించారు.<ref>రొడ్డం నరసింహ (1985). [http://nal-ir.nal.res.in/2382/01/tr_pd_du_8503_R66305.pdf రాకెట్స ఇన్ మైసూరు అండ్ బ్రిటిన్, 1750-1850 A.D.] నేషనల్ ఏరోనాటికల్ లేబొరేటరి అండ్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ అఫ్ సైన్స్.</ref>

స్టీఫెన్ అలీవర్ ఫాట్ మరియు జాన్ ఎఫ్ గిల్మార్టిన్ జూనియర్‌లు ''ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా'' (2008)లో: [[మైసూరు|మైసూర్]] రాజు "[[హైదర్ అలీ|హైదర్ అలీ]]" ఒక ముఖ్యమైన మార్పుతో యుద్ధ రాకెట్‌లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు; దహనమయ్యే పొడిని ఉంచేందుకు లోహ స్తంభాలు ఉపయోగించడం ముఖ్యమైన మార్పుగా పేర్కొన్నారు. ఆయన ఉపయోగించిన సుత్తితోకొట్టి మృదువుగా చేసిన ఇనుము ముడిదైనప్పటికీ, నల్ల మందు పాత్ర యొక్క పేలుడు సామర్థ్యం ముందు కాలానికి చెందిన కాగిత నిర్మాణం కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. తద్వారా అత్యధిక అంతర్గత పీడనం సాధ్యపడింది, దీంతో దూర ప్రాంతాలపై దాడికి అనువైన పరిస్థితి ఏర్పడింది. ఒక పొడవైన వెదురు కర్రకు తోలు వార్లతో రాకెట్ శరీరాన్ని కట్టేవారు. వీటి పరిధి(contracted; show full){{DEFAULTSORT:Kingdom Of Mysore}}

[[Category:భారతదేశ సామ్రాజ్యాలు మరియు రాజ్యాలు]]
[[Category:కర్ణాటక చరిత్ర ]]
[[Category:భారత రాచరిక రాష్ట్రాలు]]
[[Category:మైసూరు రాజ్యము]]
[[Category:1399 ఏర్పాటు చేసిన రాష్ట్రాలు మరియు భూభాగాలు]]

[[Category:1947 రద్దు చేయబడిన రాష్ట్రాలు మరియు భూభాగాలు]]
[[వర్గం:మైసూరు]]
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:టిప్పూ సుల్తాన్]]
[[వర్గం:హైదర్ అలీ]]