Difference between revisions 1995918 and 2004103 on tewiki{{యాంత్రిక అనువాదం}} {{శుద్ధి}} {{దక్షిణ ఆసియా చరిత్ర}} {{Infobox Former Country |native_name = |conventional_long_name = మైసూరు సామ్రాజ్యం / మైసూరు రాజ్యం -میسور سلطنت |common_name = మైసూరు |continent = moved from Category:Asia to the South Asia |region = దక్షిణ ఆసియా (contracted; show full)|leader1 = యదురాయ |leader3 = జయ చామరాజ వడయార్ |year_leader1 = 1399–1423 (మొదటి) |year_leader3 = 1940–1947 (చివరి) |title_leader = [[:en:Maharaja of Mysore|మహారాజ]] }} '''మైసూర్ రాజ్యం''' ([[కన్నడ భాష|కన్నడ]] ಮೈಸೂರು ಸಂಸ್ಥಾನ ''maisūru saṃsthāna'' ) ([[ఉర్దూ భాష|ఉర్దూ]] میسور سلطنت ) (1399–1947 AD) అనేది దక్షిణ భారతదేశంలో ఒక రాజ్యం, సాంప్రదాయికంగా ఆధునిక [[మైసూరు|మైసూర్]] నగర పరిసరాల్లో 1399లో దీనిని స్థాపించారనే భావన ఉంది. వడయార్ కుటుంబం పాలించిన ఈ సంస్థానం మొదట [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]]లో ఒక సామంత రాజ్యంగా ఉండేది. విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో (సుమారుగా 1565) ఇది స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 17వ శతాబ్దంలో [[నరసరాజ వడయార్]] మరియు [[చిక్క దేవరాజ వడయార్]] హయాంలో దీని యొక్క భూభాగం క్రమక్రమంగా విస్తరించబడింది, ప్రస్తుత దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇది దక్షిణ [[దక్కను పీఠభూమి]] (దక్షిణాపథం) లో శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. 18వ శతాబ్దం ద్వితీయార్ధ భాగంలో అసలు పాలకుడు [[హైదర్ అలీ]] మరియు ఆయన కుమారుడు [[టిప్పు సుల్తాన్]] హయాంలో ఈ రాజ్యం యొక్క సైనిక శక్తి మరియు అధికార పరిధి ఉన్నత స్థితికి చేరుకుంది. ఈ సమయంలో, మరాఠాలు, బ్రిటీష్వారు మరియు [[గోల్కొండ]] [[నిజాం]] రాజులతో ఈ రాజ్యం యుద్ధం చేసింది, నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలతో ఈ పోరు అంతిమ దశకు చేరుకుంది. మొదటి రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో మైసూర్ రాజ్యం విజయం సాధించగా, మూడు మరియు నాలుగో యుద్ధాల్లో పరాజయం చవిచూసింది. 1799లో నాలుగో యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత, ఈ రాజ్యంలో ఎక్కువ భూభాగాలను బ్రిటీష్వారు స్వాధీనం చేసుకున్నారు, ఈ పరిణామంతో దక్షిణ దక్షిణాపథంలో మైసూర్ రాజ్య ఆధిపత్యానికి తెరపడింది. అయితే బ్రిటీష్వారు ఒక స్వాధీన రాజ్యం రూపంలో మైసూర్ సింహసనాన్ని తిరిగి వడయార్ కుటుంబీకులకు అప్పగించారు, తరువాత ప్రాబవం కోల్పోయిన మైసూర్ రాజ్యం ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా అవతరించింది. [[భారత స్వాతంత్ర్యోద్యమము|1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం]] వచ్చే వరకు వడయార్లు ఈ రాష్ట్రాన్ని పాలించారు, తరువాత మైసూర్ [[భారత దేశము|భారతదేశం]]లో భాగమైంది. రాచరిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ, మైసూర్ భారతదేశంలో అత్యంత ఆధునిక మరియు పట్టణీకరణ చెందిన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కాలం (1799-1947) లో మైసూర్ భారతదేశంలో కళలు మరియు సాంస్కృతిక పరంగా ఒక ముఖ్యమైన కేంద్రంగా అవతరించింది. మైసూర్ రాజులు లలిత కళల్లో నైపుణ్యంగల భాష్యకారులుగా మరియు లేఖకులుగా మాత్రమే కాకుండా గొప్ప పోషకులుగా కూడా ఖ్యాతి గడించారు, ఈ రోజుకు కూడా సంగీతం మరియు కళల్లో వారి వారసత్వం కనిపిస్తుంది. ==చరిత్ర== ===ప్రారంభ చరిత్ర=== [[File:Joppen1907MysoreChickDeoWadiyar1704.jpg|right|thumb|చిక్క దేవరాజ వడయార్ రాజు హయాంలో మైసూర్ రాజ్యం (1704) ]] అనేక శిలా మరియు రాగి ఫలక [[శాసనం|శాసనాలు]], మైసూర్ ప్యాలస్కు చెందిన గ్రంథాలు మరియు కన్నడ, [[పర్షియన్ భాష|పర్షియన్]] మరియు ఇతర భాషల్లోని సమకాలీన సాహిత్య గ్రంథాలు ఈ రాజ్యం యొక్క చరిత్రకు మూలాలుగా ఉన్నాయి.<ref name="vamsha">కామత్ (2001), పేజీలు 11–12, పేజీలు 226–227; ప్రాణేష్ (2003), పే. 11</ref><ref name="vamsha10">నరసింహచార్య (1988), పే 23</ref><ref name="vamsa">సుబ్రహ్మణ్యం (2003), పే 64; రైస్ E.ప. (1921), పే. 89</ref> సాంప్రదాయిక మూలాలు ప్రకారం, ఆధునిక [[మైసూరు|మైసూర్]] నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఒక చిన్న రాజ్యంగా ఈ సంస్థానం స్థాపించబడింది, దీనిని ఇద్దరు సోదరులు స్థాపించారు, వారి పేర్లు యడురాయ (విజయ అనే పేరుతో ఆయనను కూడా గుర్తిస్తారు) మరియు కృష్ణరాయ. వీరి మూలాలపై భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి, ఇప్పటికీ ఈ అంశం చర్చనీయాంశంగా ఉంది; కొందరు చరిత్రకారులు వీరు ఉత్తర భారతదేశంలోని ద్వారక ప్రాంతానికి చెందినవారని సూచిస్తున్నారు, <ref name="cha">కామత్ (2001), పే 226</ref><ref name="feud">రైస్ B.L. (1897), పే. 361</ref> ఇతరులు వీరు కర్ణాటకకు చెందినవారనే వాదన వినిపిస్తున్నారు.<ref name="dwarka">ప్రాణేష్ (2003), పేజీలు 2–3</ref><ref name="opportune">విల్క్స్, ఐయంగర్ ఇన్ ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పేజీలు 275–276</ref> యడురాయ స్థానిక రాజకుమారి చిక్కదేవరశిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది, "[[వడయార్]]" (''వాచ్యంగా'' "ప్రభువు") అనే భూస్వామ్య పట్టాన్ని స్వీకరించారు, తరువాతి రాజవంశం ఈ పట్టాన్ని కొనసాగించింది.<ref name="title">ఐయంగర్ (1911), పే 275; ప్రాణేష్ (2003), పే 2</ref> వడయార్ కుటుంబం యొక్క మొదటి స్పష్టమైన ప్రస్తావన విజయనగర రాజు [[అచ్యుత దేవ రాయలు|అచ్యుత దేవరాయ]] (1529-1542) హయాంలో 16వ శతాబ్దపు కన్నడ సాహిత్యంలో ఉంది; వడయార్లు తమ గురించి తాము ఏర్పాటు చేసిన మొట్టమొదటి శాసనాన్ని 1551 సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు, దీనిని తిమ్మరాజ పాలనాకాలంలో ఏర్పాటు చేశారు.<ref name="prin">స్టెయిన్ (1989), పే. 82</ref> ===స్వయంప్రతిపత్తి: పురోగమనాలు మరియు తిరోగమనాలు=== 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యే వరకు మైసూర్ దానికి ఒక సామంత రాజ్యంగా ఉండేది. ఈ సమయానికి, 300 మంది సైనిక సిబ్బంది రక్షకులుగా ఈ రాజ్యం ముప్పైమూడు గ్రామాలకు విస్తరించింది.<ref name="soldier">{{Harvnb|Stein|1987|p=82}}</ref> రాజు తిమ్మరాజ II కొన్ని పరిసర సంస్థానాలను స్వాధీనం చేసుకున్నారు, <ref name="timma">కామత్ (2001), పే. 227</ref> మరియు రాజు ''బోలా'' చామరాజ IV (''వాచ్యంగా'' "ముక్కుసూటి") ఈ రాజవంశంలో రాజకీయ ప్రాధాన్యత గల మొదటి రాజుగా ఖ్యాతి గడించారు, ఆయన నామమాత్రపు విజయనగర చక్రవర్తి అరవీడు రామరాయ హయాంలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు.<ref name="bald">సుబ్రహ్మణ్యం (2001), పే. 67</ref> అరవీడు రామరాయ మరణం తరువాత, వడయార్లు తమ ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు, రాజ వడయార్ I విజయనగర గవర్నర్ ('(contracted; show full)ot;>సుబ్రహ్మణ్యం (2001), పే.69; కామత్ (2001), పేజీలు. 228–229</ref> ఈ విస్తరణ ఫలితంగా [[పడమటి కనుమలు|పశ్చిమ కనుమల]] నుంచి కోరమండల్ మైదానం యొక్క పశ్చిమ సరిహద్దుల వరకు దక్షిణ భారతదేశం నడిబొడ్డున గణనీయమైన భూభాగాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, ఈ రాజ్యం ఎటువంటి సముద్రతీరం లేకుండా అన్నివైపులా భూహద్దులకే పరిమితమైంది. దీనికి పరిష్కారం కోసం చిక్క దేవరాజ చేసిన ప్రయత్నాలు మైసూర్ రాజ్యానికి ఇక్కెరీకి చెందిన ''నాయకా'' రాజులు మరియు కొడగు (ఆధునిక కూర్గ్) రాజుల (''రాజాలు'' ) తో యుద్ధాన్ని తెచ్చిపెట్టాయి; ఈ కాలంలో ఇక్కెరీ మరియు కొడగు రాజులు కనరా తీరాన్ని (ఆధునిక కర్ణాటక తీర ప్రాంతాలు) మరియు మధ్యలోని కొండ ప్రాంతాన్ని తమ మధ్య పంచుకొని పాలించేవారు.<ref name="coast">సుబ్రహ్మణ్యం (2001), పే.69</ref> ఈ యుద్ధం మిశ్రమ ఫలితాలు ఇచ్చింది, పెరియపట్నాన్ని మైసూర్ స్వాధీనం చేసుకున్నప్పటికీ, పాలుపారే వద్ద వెనుకంజ వేయాల్సి వచ్చింది.<ref name="reverse">సుబ్రహ్మణ్యం (2001), పే. 70</ref> (contracted; show full)] కర్ణాటక చరిత్రలో సుప్రసిద్ధ స్థానాన్ని పొందారు.<ref name="prow">కామత్ లో షమ రావు (2001), పే. 233</ref><ref name="prow1">ఒక మిలిటరీ నిపుణుడు మరియు అత్యంత భలం, తేజం మరియు సమృద్ధి కలిగిన వ్యక్తీ,(చోప్రా et al. 2003, పే. 76)</ref> ఉపఖండంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో హైదర్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో యూరోపియన్ రాజ్యాలు తమను తాము వాణిజ్య సంస్థల రూపం నుంచి రాజకీయ శక్తులుగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉండగా, మొఘల్ ''సూబేదార్'' గా నిజాం దక్కను ప్రాంతంలో తన లక్ష్యాలను సాధించారు, మరాఠాలు పానిపట్ యుద్ధంలో పరాజయం తరువాత దక్షిణాదిలోని సురక్షిత ప్రాంతాలవైపు వెనుకంజ వేశారు. ఈ కాలంలో కర్ణాటకపై పట్టు కోసం బ్రిటీష్వారితో ఫ్రెంచ్వారు పోటీ పడ్డారు- ఈ పోటీలో బ్రిటీష్వారు అంతిమ విజేతలుగా నిలిచారు, బ్రిటీష్ కమాండర్ సర్ ఐర్ కూట్ నేతృత్వంలోని సైన్యం 1760లో జరిగిన వాండ్విష్ యుద్ధంలో కాంమ్టే డి లిల్లీ నేతృత్వంలోని ఫ్రెంచ్ సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించింది, దక్షిణాసియాలో బ్రిటీష్వారి ఆధిపత్యాన్ని పటిష్టఠపరిచిన ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక పరిణామంగా గుర్తించపడుతుంది.<ref name="Venkata Ramanappa 1975 p. 207">వెంకట రామనప్ప, M. N. (1975), పే 207</ref> ఈ కాలంలో మైసూర్కు వడయార్లు నామమాత్రపు అధిపతులుగా కొనసాగినప్పటికీ, అసలు అధికారం మాత్రం హైదర్ అలీ మరియు ఆయన కుమారుడు [[టిప్పు సుల్తాన్|టిప్పు]] చేతుల్లోకి వెళ్లింది.<ref name="hands">చోప్రా et al. (2003), పే. 71, 76</ref> (contracted; show full) హైదర్ అలీ మరింత బలీయమైన శక్తిగా మారకుండా అడ్డుకునేందుకు, బ్రిటీష్వారు మరాఠాలు మరియు గోల్కొండ [[నిజాం|నిజామ్]]తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, 1767లో జరిగిన మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఈ భాగస్వామ్యంతోనే బ్రిటీష్వారు పోరాడారు. సంఖ్యాపరమైన ఆధిపత్యం సాధించినప్పటికీ, హైదర్ అలీ చెంఘామ్ మరియు తిరువన్నామళై యుద్ధాల్లో పరాజయం పాలైయ్యారు. హైదర్ అలీ వ్యూహాత్మకంగా మద్రాస్ (ఆధునిక చెన్నై) కు ఐదు మైళ్ల దూరం వరకు తన సైన్యాన్ని తరలించే వరకు బ్రిటీష్వారు ఆయన శాంతి చర్చల ప్రస్తావనను విస్మరించారు, చివరకు ఆయన ఈ వ్యూహం ద్వారా విజయవంతంగా బ్రిటీష్వారితో శాంతి కుదుర్చుకున్నారు.<ref name="Venkata Ramanappa 1975 p. 207" /><ref name="dhar" /><ref name="peace">చోప్రా et al. (2003), పే. 73</ref> 1770లో మాధవరావు పేష్వా యొక్క మరాఠా సైన్యం మైసూర్ను ఆక్రమించుకుంది (1764 మరియు 1772 మధ్యకాలంలో మాధవరావు మరియు హైదర్ అలీ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి, వీటిలో హైదర్ పరాజయం పాలైయ్యారు), 1769 ఒప్పందంలో భాగంగా హైదర్ ఈ యుద్ధాల్లో బ్రిటీష్వారి మద్దతు అందుతుందని ఆశించారు, అయితే ఈ పోరుకు దూరంగా ఉండటం ద్వారా బ్రిటీష్వారు హైదర్ను మోసగించారు. బ్రిటీష్వారు చేసిన మోసం మరియు తరువాత తనకు ఎదురైన పరాజయాలు ఫలితంగా బ్రిటీష్వారిపై హైదర్ తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నారు - ఈ ద్వేషాన్నే ఆయన కుమారుడు కూడా పంచుకున్నారు, తరువాతి మూడు దశాబ్దాల్లో జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలకు ఈ పగే ప్రధాన కారణంగా ఉంది. 1779లో హైదర్ అలీ ఆధునిక తమిళనాడు మరియు దక్షిణాన [[కేరళ]]లోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు, తద్వారా రాజ్యం యొక్క వైశాల్యాన్ని సుమారుగా 80,000 మై² (205,000 కిమీ²) కు పెంచారు.<ref name="dhar" /> 1780లో ఫ్రెంచ్వారితో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మరాఠాలు మరియు నిజామ్తో శాంతి కుదుర్చుకున్నారు.<ref name="autogenerated1">చోప్రా et al. (2003), పే. 74</ref> అయితే హైదర్ అలీని మరాఠాలు మరియు నిజామ్ మోసగించారు, వీరు బ్రిటీష్వారితో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జుూలై 1779లో హైదర్ అలీ 80,000 మందితో కూడిన తన సైన్యంతో కర్ణాటకను ఆక్రమించుకున్నారు, ఈ సైన్యంలో ఎక్కువగా అశ్వదళం ఉంది, మంటల్లో భగ్గుమంటున్న గ్రామాల నడుమన కనుమల గుండా కిందివైపుకు వెళ్లి ఉత్తర ఆర్కాట్లోని బ్రిటీష్వారి కోటలను ముట్టడించేందుకు సన్నద్ధమయ్యారు, దీనితో రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం మొదలైంది. హైదర్ అలీ బ్రిటీష్వారిపై కొన్ని ప్రారంభ విజయాలు సాధించారు, ముఖ్యంగా పొల్లిలూర్ వద్ద విజయం సాధించారు, చిల్లియన్వాలా మరియు ఆర్కాట్ యుద్ధాలు జరిగే వరకు భారతదేశంలో బ్రిటీష్వారికి ఎదురైన అతిపెద్ద పరాజయంగా ఇది గుర్తించ(contracted; show full) విజయవంతంగా శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకుంది, దీంతో టిప్పు సుల్తాన్ పరాజయం పాలైయ్యారు, ఆపై శ్రీరంగపట్నం ఒప్పందం కుదిరింది. మైసూర్ రాజ్యంలో సగ భాగాన్ని మిత్రరాజ్యాలకు పంచిపెట్టారు, ఆయన ఇద్దరు కుమారులను విడిపించేందుకు ధనం చెల్లించాల్సి వచ్చింది.<ref name="surrender">చోప్రా et al. (2003), పే. 78–79; కామత్ (2001), పే. 233</ref> అయినప్పటికీ అధైర్యపడని టిప్పు సుల్తాన్ తన ఆర్థిక మరియు సైనిక శక్తిని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. విప్లవ మార్పులకు లోనైన ఫ్రాన్స్, [[ఆఫ్ఘనిస్తాన్|ఆఫ్ఘనిస్ థతాన్]] అమీర్ మరియు [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]] మరియు అరేబియా నుంచి మద్దతు పొందేందుకు రహస్యంగా ప్రయత్నించారు. ఇదిలా ఉంటే, ఫ్రెంచ్వారి ప్రమేయం కోసం చేసిన ఈ ప్రయత్నాలు బ్రిటీష్వారికి త్వరగానే తెలిసిపోయాయి, మరాఠాలు మరియు నిజాం మద్దతుతో బ్రిటీష్వారు ఆ సమయంలో ఈజిప్టులో ఫ్రెంచ్వారితో యుద్ధం చేస్తున్నారు. 1799లో జరిగిన నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించారు, దీంతో మైసూర్ రాజ్యం యొక్క స్వాతంత్ర్యానికి పూర్తిగా తెరపడింది.<ref name="end">చోప్రా et al. (2003), పేజీలు. 79–80; కామత్ (2001), పేజీలు. 233–234</ref> ఆధునిక భారతీయ చరిత్రకారులు టిప్పు సుల్తాన్ను బ్రిటీష్వారికి ఒక చిరకాల శత్రువుగా పరిగణిస్తారు, ఆయనను ఒక సమర్థవంతమైన పాలకుడిగా మరియు ఒక పరిశోధకుడిగా గుర్తిస్తున్నారు.<ref name="enemy">చోప్రా et al. (2003), పేజీలు. 81–82</ref> ===రాచరిక రాష్ట్రం=== టిప్పు పతనం తరువాత, మైసూర్ రాజ్యంలో ఒక భాగాన్ని స్వాధీనం చేసుకుని, [[మద్రాస్ ప్రెసిడెన్సీ]] మరియు [[నిజాం]] మధ్య పంచారు. నిజాంకు నేటి కడప, కర్నూలు జిల్లాలను పంచినట్టే పంచి క్రీ.శ.1800లో సైన్యఖర్చుల బాకీల కింద తిరిగి ఈస్టిండియావారే మద్రాస్ ప్రెసిడెన్సీలోకి జమకట్టుకున్నారు<ref name="కథలు గాథలు"/>. దీని ప్రకారం మిగిలిన భూభాగాన్ని ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా మార్చారు; వడయార్ కుటుంబంలోని ఐదేళ్ల వారసుడు కృష్ణరాజ IIIను సింహాసనాన్ని అధిష్టించే రాజుగా ఎంపిక చేశారు, గతంలో టిప్పు కింద పని చేసిన పూర్ణయ్యను ముఖ్యమంత్రి (''దివాన్'' ) గా నియమించారు, రెజెంట్ మరియు లెప్టినెంట్ కల్నల్ బ్యారీ క్లోజ్ బ్రిటీష్ పాలకుడిగా పాలనా పగ్గాలు చేపట్టారు. మైసూర్ రాజ్యం యొక్క విదేశాంగ విధానం బ్రిటీష్వారి చేతుల్లోకి వెళ్లడంతోపాటు, మైసూర్లో ఒక బ్రిటీష్ దళాన్ని నిర్వహించేందుకు ఒక వార్షిక కప్పాన్ని మరియు సబ్సిడీని పొందారు.<ref name="army">కామత్ (2001), పే. 249</ref><ref name="install">కామత్ (2001), పే 234</ref><ref>వెంకట రామనప్ప, M. N. (1975), పే(contracted; show full) మహారాజా చామరాజా IX మరణించిన తరువాత, పదకొండు ఏళ్ల బాలుడిగా ఉన్న కృష్ణరాజా IV 1895లో సింహాసనాన్ని అధిష్టించారు. ఫిబ్రవరి 8, 1902న కృష్ణరాజా పాలనా పగ్గాలు చేపట్టే వరకు ఆయన తల్లి మహారాణి కెంపరాజామన్నియావరు రాజప్రతినిధిగా పాలన సాగించారు.<ref>[3] ^ రమా జోయిస్, M. 1984. లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఏన్షియంట్ లీగల్ జ్యుడిషియల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఢిల్లీ: యూనివర్సల్ లా Pub. Co. పే 597</ref> ఆయన పాలనలో సర్ ఎం. విశ్వేశ్వరయ్య దివాన్గా పని చేశారు, మహారాజా ఈ కాలంలో మైసూర్ను పురోగమన మరియు ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దారు, ముఖ్యంగా పరిశ్రమలు, విద్య, వ్యవసాయం మరియు కళల్లో రాష్ట్రం పురోభివృద్ధి సాధించింది. మైసూర్లో సాధించిన ఈ పురోభివృద్ధి కారణంగా మహాత్మా గాంధీ మహారాజాను ఒక "''రాజర్షి'' "గా కీర్తించారు.<ref>[10] ^ పుట్టస్వామయ్య, K., 1980. ఎననమిక్ డెవలప్మెంట్ ఆఫ్ కర్నాటక ఎ ట్రీటైజ్ ఇన్ కంటిన్యుటీ అండ్ ఛేంజ్ న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ & IBH, పే. 3</ref> బ్రిటీష్ తత్వవేత్త మరియు ఆసియా దేశాల నిపుణుడు పా(contracted; show full); ల పక్షపాతిగా ఉండేవారని తెలుస్తోంది, తన హయాంలో రైతులను పన్నుల పెంపు నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.<ref name="ranadulla" /> ముందుకాలపు విజయనగర సామ్రాజ్యంలో చెలామణిలో ఉన్నవాటిని పోలిన బంగారు నాణేలను (''కాంతీరయి ఫణం'' ) ఈ రాజ్యం తమ భూభాగంలో విడుదల చేసినట్లు మొట్టమొదటి ఆధారాలు నరసరాజ వడయార్ పాలనలో లభించాయి.<ref name="phanam">కామత్ (2001), పే 228; వెంకట రామనప్ప, M. N. (1975), పే. 201</ref> చిక్క దేవరాజా హయాంలో అనేక సంస్కరణలు అమలు చేయబడ్డాయి. రాజ్యం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అంతర్గత పరిపాలనలో మార్పులు చేయబడ్డాయి. తద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారింది. ఒక తపాలా వ్యవస్థ ఆచరణలోకి వచ్చింది. సమాజంలో మరింత మందికి చేరువయ్యే ఆర్థిక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ప్రత్యక్ష పన్నుల స్థానంలో అనేక సూక్ష్మ పన్నులు విధించారు, దీని ఫలితంగా భూమి పన్ను రూపంలో రైతులు మరింత ధనం చెల్లించాల్సి వచ్చింది.<ref>వెంకట రామనప్ప, M. N. (1975), పే.203</ref> కోశాగారంలోకి వచ్చే రోజువారీ ఆదాయం 90,000,000 ''పగోడా'' (ఒక నగదు ప్రమాణం) లో రాజు వ్యక్తిగత వాటాను తీసుకునేవారు- దీనిలో ఆయన తన వాటా కింద "తొమ్మిది [[కోటి|కోట్ల]] నారాయణా"ల మొత్తం (''నవకోటి నారాయణ'' ) తీసుకుంటారు. 1700లో ఔరంగజేబు దర్బారుకు రాజు ఒక దౌత్య బృందాన్ని పంపారు, ఈ సందర్భంగా రాజుకు ఔరంగజేబు ''జుగ్ దేవ రాజా'' అనే పట్టాన్ని ప్రదానం చేశారు, అంతేకాకుండా దంతపు సింహాసనంపై కూర్చునేందుకు అనుమతించారు. దీని తరువాత, ఆయన జిల్లా కార్యాలయాలు (''అట్టారా కచేరీ'' ), పద్దెనిమిది విభాగాలతో కూడిన కేంద్ర సచివాలయాన్ని స్థాపించారు, ఆయన పాలనా యంత్రాంగం మొఘల్ వారి రూపంలోకి మార్చబడింది.<ref name="sec">కామత్ (2001), పేజీలు 228–229; వెంకట రామనప్ప, M. N. (1975), పే. 203</ref> [[హైదర్ అలీ]] పాలనా కాలంలో, రాజ్యాన్ని సమానమైన భూభాగాలు ఉన్న ఐదు రాష్ట్రాలు (''అసోఫీస్'' ) గా విభజించబడింది, వీటిలో మొత్తంమీద 121 తాలూకాలు (''పరగణాలు'' ) ఉన్నాయి.<ref name="british">కామత్ (2001), పే. 233</ref> [[టిప్పు సుల్తాన్]] ''నిజమైన'' పాలకుడిగా బాధ్యతలు చేపట్టే సమయానికి {{convert|160000|km²|0|abbr=on}} (62,000 మై²) వైశాల్యానికి రాజ్యం విస్తరించింది, దీనిని 37 ప్రావీన్స్లుగా విభజించారు, దీనిలో మొత్తం 124 తాలూకాలు (''అమీల్'' ) ఉన్నాయి. ప్రతి ప్రావీన్స్కు ఒక గవర్నర్ (''అసోఫ్'' ) మరియు ఒక డిప్యూటీ గవర్నర్ ఉండేవారు. ప్రతి తాలూకాకు ''అమీల్దార్'' అని పిలిచే ఒక అధిపతి మరియు ప్రతి గ్రామ సమూహానికి ''పటేల్'' అనే ఒక అధిపతి ఉండేవారు.<ref name="install" /> కేంద్ర పాలనా యంత్రాంగంలో ఆరు విభాగాలు ఉంటాయి, వీటికి మంత్రులు అధిపతులుగా ఉండేవారు, ప్రతి విభాగానికి నలుగురు సభ్యులతో కూడిన ఒక సలహా మండలి సహకరిస్తుంది.<ref name="zum">కామత్ (2001), పే. 235</ref> 1831లో బ్రిటీష్వారి ప్రత్యక్ష పాలనలోకి వచ్చి రాచరిక రాష్ట్రంగా మారిన తరువాత ప్రారంభ కమిషనర్లుగా లూషింగ్టన్, బ్రిగ్స్ మరియు మోరిసన్ పని చేశారు, వీరి తరువాత మార్క్ కుబ్బాన్ బాధ్యతలు చేపట్టారు, కుబ్బాన్ 1834లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.<ref name="blore">కామత్ (2001), పే. 251</ref> ఆయన [[బెంగుళూరు|బెంగళూరు]]ను రాజధానిగా చేశారు, రాచరిక రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లుగా విభజించారు, ప్రతి డివిజన్కు ఒక బ్రిటీష్ సూపరిండెంట్ ఉంటారు. రాష్ట్రాన్ని ఆపై 85 తాలూకా కోర్టులతో 120 తాలూకాలుగా ఉప విభజన చేశారు, దిగువ స్థాయి పాలన మొత్తం కన్నడ భాషలో జరిగేది.<ref name="blore" /> కమిషనర్ కార్యాలయంలో ఎనిమిది శాఖలు ఉంటాయి; అవి రెవెన్యూ, తపాలా, పోలీస్, అశ్విక దళం, ప్రజా పనులు, వైద్య, జంతు సంరక్షణ, న్యాయ మరియు విద్యా శాఖలు. అత్యున్నత స్థాయిలో కమిషనర్ కోర్టుతో న్యాయవ్యవస్థలో అధికార క్రమం ఉంటుంది, కమిషనర్ కోర్టు కింద ''హుజూర్ అదాలత్'' , నాలుగు సూపరింటెండింగ్ కోర్టులు మరియు దిగువ స్థాయిలో ఎనిమిది ''సదర్ మున్సిఫ్'' కోర్టులు ఉంటాయి.<ref name="adalat">కామత్ (2001), పే. 252</ref> 1862లో లెవిన్ బౌరింగ్ ప్రధాన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు, 1870 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగారు. ఈ కాలంలో ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టం, భారత శిక్షా స్మృతి మరియు నేర విచారణ ప్రక్రియ నిబంధన అమల్లోకి వచ్చాయి, న్యాయ వ్యవస్థను పాలనా యంత్రాంగం యొక్క కార్యనిర్వాహక భాగాల నుంచి వేరు చేశారు.<ref name="adalat" /> అప్పగింత తరువాత, [[చెన్నై]]కు చెందిన రంగాచార్లును దివాన్గా చేశారు. ఆయన హయాంలో, 1881లో 144 మంది సభ్యులతో బ్రిటీష్ ఇండియాలో మొట్టమొదటి ప్రతినిధుల సభ ఏర్పాటయింది.<ref name="ranga">కామత్ (2001), పే. 254</ref> ఆయన తరువాత 1883లో శేషాద్రి బాధ్యతలు చేపట్టారు, ఆయన హయాంలోనే కోలార్ బంగారు గనుల్లో బంగారం త్రవ్వకం మొదలైంది. శివసముద్రం జలవిద్యుత్ ప్రాజెక్టు 1899లో ప్రారంభమైంది (భారతదేశంలో ఈ దిశగా జరిగిన మొదటి ప్రధాన ప్రయత్నం ఇదే కావడం గమనార్హం), బెంగళూరుకు విద్యుత్ మరియు త్రాగునీరు (తరువాత పైపుల ద్వారా) సరఫరా చేయబడింది.<ref name="iyer">కామత్ (2001), పేజీలు. 254–255</ref> శేషాద్రి అయ్యర్ తరువాత బాధ్యతలు చేపట్టిన పి.ఎన్. కృష్ణమూర్తి 1905లో రికార్డులు నిర్వహించేందుకు సచివాలయ పుస్తకాన్నిఏర్పాటు చేయడంతోపాటు, కో-ఆపరేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు, <ref name="iyer" /> ఆయన తరువాత బాధ్యతలు చేపట్టిన వి.పి. మాధవరావు అడవుల పరిరక్షణపై దృష్టి పెట్టారు, తరువాత టి. ఆనందరావు కన్నంబేడి జలాశయ ప్రాజెక్టును ఖరారు చేశారు.<ref name="dam">కామత్ (2001), పే. 257</ref> (contracted; show full) 1926లో సర్ మీర్జా ఇస్మాయిల్ దివానుగా బాధ్యతలు స్వీకరించి ముందువారు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేశారు. భద్రావతి ఐరన్ వర్క్స్ను విస్తరించడం, భద్రావతిలో సిమెంట్ మరియు కాగిత కర్మాగారాన్ని స్థాపించడం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థాపన ఆయన హయాంలో జరిగాయి. ఉద్యానవనాలపై ఎంతో మక్కువ కనబర్చిన ఆయన బృందావన్ గార్డెన్స్ (కృష్ణరాజ సాగర్) ను నిర్మించడంతోపాటు, ఆధునిక మాండ్య జిల్లాలో {{convert|120000|acre|km2}}లలో వ్యవసాయం కోసం [[కావేరి నది|కావేరీ నది]] నుంచి పెద్ద కాలువను త్రవ్వించారు.<ref name="ismail">కామత్ (2001), పే. 260</ref> ==ఆర్థిక వ్యవస్థ== అధిక సంఖ్యలో ప్రజలు గ్రామాల్లో నివసించేవారు, వీరికి [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా ఉండేది. రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి వుండేది. ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు మరియు పువ్వులు పండించేవారు. చెరుకు మరియు పత్తి ప్రధాన వాణిజ్య పంటలుగా ఉండేవి. వ్యవసాయ జనాభాలో భూస్వాములు (''గావుండా'' , ''జమీందార్'' , ''హెగ్గాడే'' ) కూడా భాగంగా ఉంటారు, భూమిలేని అనేక మంది కూలీలను ఉపయోగించు కొని వీరు వ్యవసాయం చేసేవారు, వీరికి జీతం కింద ధాన్యాన్ని ఇచ్చేవారు. అవసరమైనట్లయితే సన్నకారు రైతులు కూడా కూలీలుగా పని చేసేందుకు వెళ్లేవారు.<ref name="labour">శాస్త్రి (1955), పే. 297–298</ref> భూమిలేని కూలీలు అందుబాటులో ఉండటంతో రాజులు మరియు భూస్వాములు రాజ భవనాలు, ఆలయాలు, మసీదులు, జలాశయాలు మరియు చెరువుల వంటి నిర్మాణాలు చేపట్టారు.<ref name="tank">చోప్రా et al. (2003), పే. 123</(contracted; show full)uot;>కామత్ (2001), పేజీలు. 235–236</ref> కనకపురా మరియు తారామండల్పేట్ ప్రదేశాల్లో వరుసగా ఫిరంగులు మరియు తుపాకీ మందు తయారీ కోసం ప్రభుత్వ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. చక్కెర, ఉప్పు, ఇనుము, మిరియాలు, ఏలకులు, వక్క, పొగాకు మరియు [[ఎర్రచందనం|చందనం]] వంటి నిత్యావసరాల ఉత్పత్తిలో ప్రభుత్వం గుత్తాధిపత్యం కలిగివుండేది, అంతేకాకుండా చందనం చెట్ల నుంచి సుగంధ నూనెను తీయడం మరియు వెండి, బంగారం మరియు విలువైన రాళ్ల త్రవ్వకాలు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. చందనాన్ని చైనా మరియు పర్షియన్ గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. రాజ్యంలో 21 ప్రదేశాల్లో పట్టు పురుగుల పెంపక కేంద్రాలు అభివృద్ధి చేయబడ్డాయి.<ref name="sandal">కామత్ (2001), పేజీలు. 236–237</ref> (contracted; show full)్రిటీష్వారు పాలిస్తున్నప్పుడు వీరు ఈ గుత్తాధిపత్యాన్ని కోల్పోయారు. సాల్ట్పెట్రి (పొటాషియం నైట్రేట్) కోసం ఒక రసాయన ప్రత్యామ్నాయాన్ని దిగుమతి చేయడం ఉన్నత వర్గాన్ని కూడా ప్రభావితం చేసింది, వీరు తుపాకీ మందుగుండులో ఉపయోగించేందుకు అవసరమయ్యే సాల్ట్పెట్రికి సాంప్రదాయిక తయారీదారులుగా ఉండేవారు. కిరోసిన్ దిగుమతి చమురులు సరఫరా చేసే గానిగా వర్గాన్ని ప్రభావితం చేసింది. విదేశీ ఎనామిల్ మరియు టపాకాయల పరిశ్రమలు స్థానిక మృణ్మయ వ్యాపారాన్ని ప్రభావితం చేశాయి, మిల్లుల్లో తయారు చేసిన దుప్పట్లు, ''కంబళ్లు'' గా పిలిచే దేశీయ దుప్పట్ల స్థానాన్ని ఆక్రమించాయి.<ref name="kambli">కామత్ (2001), పే. 287</ref> ఈ ఆర్థికపరమైన పతనం వర్గ ఆధారిత సామాజిక సంక్షేమ సంస్థల ఏర్పాటుకు దారితీసింది, కొత్తగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితిని తట్టుకొని నిలబడేందుకు తమ వర్గంలోని ప్రజలకు సాయం అందించడానికి, ముఖ్యంగా విద్య మరియు ఆవాసం కోరుకునే విద్యార్థుల కోసం యువజన వసతి కేంద్రాల ఏర్పాటు కోసం ఈ సంస్థలు ఏర్పడ్డాయి.<ref name="hostel">కామత్ (2001), పేజీలు. 288–289</ref> ఇదిలా ఉంటే బ్రిటీష్వారి ఆర్థిక విధాన(contracted; show full)్రాయపడ్డారు.<ref name="srivai">కామత్ (2001), పే. 229</ref> చరిత్రకారుడు అయ్యంగార్ వాదన ప్రకారం ప్రసిద్ధి చెందిన నరసరాజా I మరియు చిక్క దేవరాజలతోపాటు కొందరు రాజులు వైష్ణవులు, అయితే అందరు వడయార్ పాలకులు వైష్ణవులు కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.<ref name="wod-rule">ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పే.304</ref> దక్షిణ భారతదేశ సాంస్కృతిక కేంద్రంగా ఆధునిక రోజు మైసూర్ నగరం అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఆధారాలను వారు సార్వభౌమత్వం పొందిన కాలంలో గుర్తించారు.<ref name=" tayagacentre">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref> రాజా వడయార్ I మైసూర్లో దసరా వేడుకలు నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు, వీరికి ముందు విజయనగర రాజ కుటుంబం కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేది.<ref name="tayagacentre"/><ref name="das">ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పే. 290</ref> మధ్యయుగం చివరి కాలంలో జైన మతం క్షీణించినప్పటికీ, మైసూర్ రాజులు ఈ మతానికి పోషకులుగా ఉన్నారు, మైసూర్ రాజులు శ్రావణబెళగోలా పట్టణంలో జైన సన్యాస కేంద్రాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.<ref name="tayagacentre"/><ref name="lak1">కామత్ (2001), పేజీలు. 229–230</ref> శ్రావణబెళగోలాలో ముఖ్యమైన జైన మత కార్యక్రమం అయిన ''మహామస్తకాభిషేకం'' వేడుకలో కొందరు వడయార్ రాజులు పాల్గొనడంతోపాటు, 1659, 1677, 1800, 1825, 1910, 1925, 1940, మరియు 1953 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా ''పూజ'' లు కూడా నిర్వహించారు.<ref name="puja">సింగ్ (2001), పేజీలు. 5782–5787</ref> దక్షిణ భారతదేశం మరియు [[ఇస్లాం మతం|ఇస్లాం]] మధ్య సంబంధాలు 7వ శతాబ్దం నుంచి ఉన్నాయి, ఈ సమయంలోనే హిందూ సామ్రాజ్యాలు మరియు ఇస్లామిక్ [[ఖిలాఫత్]] ల మధ్య వ్యాపార సంబంధాలు బాగా వృద్ధి చెందాయి. ఈ ముస్లిం వ్యాపారులు మలబార్ తీరంలో స్థిరపడి, స్థానిక హిందూ మహిళలను వివాహం చేసుకున్నారు, వీరి వారసులు ''మాపిలాస్'' గా గుర్తింపు పొందారు.<ref name="map">శాస్త్రి (1955), పే.396</ref> 14వ శతాబ్దం సమయానికి ముస్లింలు దక్షిణ భారతదేశంలో గణనీయమైన మైనారిటీ వర్గంగా మారింది, పోర్చుగీసు మిషనరీల రాకతో వారి వృద్ధి నిలిచిపోయింది.<ref name="map" /> ముస్లిం మతస్తుడైనప్పటికీ హైదర్ అలీ తాను పాలిస్తున్న ఈ హిందూ రాజ్య పాలనా వ్యవహారాల్లో తన మత విశ్వాసాల జోక్యాన్ని అనుమతించలేదు. ఇదిలా ఉంటే చరిత్రకారులు హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ యొక్క ఉద్దేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టిప్పు హిందు(contracted; show full)షా పదకోశం మరియు ''కన్నడ సమాచార'' అని పిలిచే ఒక కన్నడ వార్తాపత్రిక ముద్రణలు 19వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభమయ్యాయి.<ref name="press">కామత్ (2001), పేజీలు. 279–280; మూర్తి (1992), పే 168</ref> ఆలూరు వెంకటరావు కన్నడ పౌరుల సాధనల గురించి వివరిస్తూ తన యొక్క ''కర్ణాటక గాథా వైభవ'' పుస్తకంలో ఒక సమగ్ర కన్నడ చరిత్రను అందించారు.<ref name="rekindle">కామత్ (2001), పే. 281; మూర్తి (1992), పే.172</ref> సాంప్రదాయిక ఆంగ్ల మరియు సంస్కృత నాటకాలు, <ref name="plays">మూర్తి (1992), పే. 169</ref> మరియు స్థానిక యక్షగాన నాటకాలు కన్నడ నాటక రంగాన్ని ప్రభావితం చేశాయి, గుబ్బి వీరన్న వంటి ప్రసిద్ధ నాటక కళాకారులు వీటి ద్వారా ఆవిర్భవించారు.<ref name="notedmusician">కామత్ (2001), పే. 282</ref> ప్యాలస్ మైదానంలో పబ్లిక్ అడ్రస్ వ్యవస్థల ద్వారా ప్రసారం చేయబడే కర్ణాటక సంగీతాన్ని ప్రజలు ఆస్వాదించడం మొదలుపెట్టారు.<ref name="broad">ప్రాణేష్ (2003), ప.163</ref> [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము|బెంగాల్ పునరుజ్జీవనోద్యం]] ద్వారా స్ఫూర్తి పొందిన మైసూర్ చిత్తరువులను సందరయ్య, అల సింగరయ్య మరియు బి. వెంకటప్ప తదితర కళాకారులు గీశారు.<ref name="paint">కామత్ (2001), పే. 283</ref> ===సాహిత్యం=== [[File:Intro.bmp.jpg|right|thumb|కృష్ణరాజ వడయార్ III రచించిన సంగీత గ్రంథం శ్రీతత్వనిధి మొదటి పేజి]] [[File:FullPagadeYakshagana.jpg|upright|thumb|ఒక యక్షగాన కళాకారుడు]] కన్నడ సాహిత్యం అభివృద్ధిలో మైసూర్ రాజ్యపాలనా కాలం ఒక ముఖ్యమైన యుగంగా ఉంది. మైసూరు ఆస్థానంలో ప్రసిద్ధ బ్రాహ్మణ మరియు వీరశైవ రచయితలు మరియు సంగీత కళాకారులతోపాటు, <ref name="lak1" /><ref name="sri">నరసింహాచార్య (1988), పేజీలు. 23–27</ref> రాజులు కూడా లలిత కళల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.<ref name="kan1">ముఖర్జీ (1999), పే 78; నరసింహాచార్య (1988), పే. 23, పే. 26</ref><ref name="kan100">కామత్ (2001), పేజీలు 229–230; ప్రాణేష్ (2003), ప్రిఫేస్ చాప్టర్ p(i)</ref> తత్వ శాస్త్రం మరియు మతానికి సంబంధించిన సాంప్రదాయిక సాహిత్యం ప్రాచుర్యంలోనే ఉండగా, చారిత్రక రచన, జీవిత చరిత్ర, చరిత్ర, విజ్ఞాన సర్వ(contracted; show full) (ఒక సంగీత పరికరాన్ని కనిపెట్టినందుకు గుర్తుగా దీనిని రాశారు), ఈ గ్రంథంలోని ఇరవై ఆరు అధ్యాయాల్లో రాజు యొక్క ఆస్థానం, జనరంజక సంగీతం మరియు ఆ కాలానికి చెందిన సంగీత కూర్పుల్లో రకాలను ప్రస్తావించారు.<ref name="kan13">రైస్ E.పే (1921), పే. 90; ముఖర్జీ (1999), పే. 119</ref><ref name="kan130">కామత్ (2001), పే 227; ప్రాణేష్ (2003), పే. 11</ref> రాజవంశంలో ప్రారంభ స్వరకర్తగా రాజు చిక్క దేవరాజా గుర్తింపు పొందుతున్నారు.<ref name="bahadur" /><ref name=" tayagacentre"/> ''గీతా గోపాలా'' అని పిలిచే సంగీత ప్రసిద్ధ గ్రంథం ఆయనను ఉద్దేశించి రాయబడింది. జయదేవా యొక్క సంస్కృత రచన ''గీతా గోవింద'' నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, దీనికి సొంత ప్రత్యేకత ఉంది, దీనిని ''సప్తపది'' ప్రమాణంలో రాశారు.<ref name="sapta">ముఖర్జీ (1999), పే. 78; ప్రాణేష్ (2003), పే 21</ref> కన్నడ మాట్లాడే మొత్తం ప్రాంతంపై తమదైన ముద్రవేసిన సమకాలీన రచయితల్లో బ్రాహ్మణ రచయిత లక్ష్మీసా మరియు దేశదిమ్మరి అయిన వీరశైవ రచయిత సర్వాజ్ఞ ముఖ్యులు. సాహిత్య పరిణామాల్లో మహిళా రచయితలు కూడా తమ వంతు పాత్ర పోషించారు, చెలువాంబ (కృష్ణరాజ వడయార్ I పట్టపురాణి), హెలవనకట్టే గిరియమ్మ, శ్రీ రంగమ్మ (1685) మరియు సాంచి హోన్నమ్మ (''హాదిబాడెయా ధర్మా'' , 17వ శతాబ్దం) ప్రసిద్ధ రచనలు చేశారు.<ref name="had">ముఖర్జీ (1999), పే. 143, పే 354, పే. 133, పే 135; నరసింహాచార్య (1988), పేజీలు. 24–25</ref><ref name="had1">ప్రాణేష్ (2003), పేజీలు. 33–34; రైస్ E.పే. (1921), పేజీలు. 72–73, పేజీలు. 83–88, పే. 91</ref> (contracted; show full)ొందింది. కెంపు నారాయణ యొక్క ''ముద్రమంజుషా'' ("ది సీల్ కాస్కెట్", 1823) ఆధునిక గద్య భాగంతో రూపొందిన మొట్టమొదటి రచనగా గుర్తింపు పొందింది.<ref name="mudra">మూర్తి (1992), పే. 167</ref> ఇదిలా ఉంటే ముద్దన్న రాసిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన ''అద్భుత రామాయణ'' (1895) మరియు ''రామాశ్వమేధం'' (1898) బాగా ప్రాచుర్యం పొందాయి, కన్నడ అధ్యయనకారుడు నరసింహ మూర్తి ఆయనను ఆధునిక కన్నడ సాహిత్యానికి జానూస్ (సాహిత్యంతో ముడిపడిన ఒక రోమన్ దేవత) గా పరిగణించారు. ముద్దన్న ఈ పురాతన ఇతిహాసాన్ని పూర్తిగా ఆధునిక కోణంలోకి మలిచారు.<ref name="viewpoint">మూర్తి (1992), పే. 170</ref> మైసూర్కు చెందిన మరియు మహారాజా కృష్ణరాజా III మరియు మహారాజా చామరాజా IX ఆస్థానంలో ప్రశస్తి గల వ్యక్తి బసవప్ప శాస్త్రి కన్నడ నాటక రంగ పితామహుడు (''కన్నడ నాటక పితామహా'' ) గా ప్రసిద్ధి చెందారు.<ref name="tayagacentre"/> ఆయన [[విలియం షేక్స్పియర్]] యొక్క ఓథెల్లోను ''షురసేనా చారిట్'' గా అనువదించడంతోపాటు, కన్నడలో నాటకాలు రాశారు. సంస్కృతం నుంచి కన్నడలోకి ఆయన అనువదించిన అనేక ప్రసిద్ధ అనువాదాల్లో ''కాళిదాసా'' , ''అభిజ్ఞాన శాకుంతలా'' తదితరాలు ఉన్నాయి.<ref name="basava">సాహిత్య అకాడమీ (1988), పే. 1077; ప్రాణేష్ (2003), పే.82</ref> ===సంగీతం=== [[File:Veena Subbanna Seshanna 1902.jpg|right|thumb|ప్రసిద్ధ వీణా విద్వాంసులు - వీణా సుబ్బన్న మరియు వీణా శేషన్న (1902లో ఈ ఛాయాచిత్రాన్ని తీశారు) ]] మహారాజా కృష్ణరాజా III మరియు ఆయన వారసులు చామరాజా IX, కృష్ణరాజా IV మరియు చివరి పాలకుడు జయచామరాజా హయాంలో మైసూరు ఆస్థానం అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ సంగీత పోషణా కేంద్రంగా వెలుగొందింది.<ref name="Weidman 2006, p. 66">వీడ్మన్ (2006), పే.66</ref> తంజావూరు మరియు ట్రావెన్కోర్ ఆస్థానాలు కూడా కళాకారులకు గొప్ప సౌకర్యాలు కల్పించినప్పటికీ, కళను రక్షించడానికి కృషి చేయడం మరియు ఒక్కో సంగీత కళాకారుడికి రాజ మర్యాదలు చేయడం, ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు సంగీత పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఐరోపా సంగీత ప్రచురణకర్తలు మరియు నిర్మాతలను పోషించడం ద్వారా మైసూర్ ఆస్థానం తన ప్రత్యేకత చాటుకుంది.<ref>వీడ్మన్ (2006), పే. 65</ref> స్వయంగా సంగీత కళాకారుడు మరియు సంగీత అధ్యయనకారుడు అయిన మహారాజా కృష్ణరాజా III కన్నడ భాషలో ''అనుభవ పంచరత్న'' అనే పేరుతో అనేక ''జావలీస్'' (తేలిక పాటలు) మరియు భక్తి గీతాలు స్వరపరిచారు. ఆయన స్వరకూర్పుల్లో వడయార్ రాజ కుటుంబ దైవత "చాముండి" లేదా "చాముండేశ్వరి"కి గౌరవసూచకంగా నోమ్ డి ప్లుమ్ (''[[ముద్ర]]'' ) ఉంటుంది.<ref name="tayagacentre"/> ఆయన వారసుడు చామరాజా IX 1891లో ఓరియంటల్ లైబ్రరీని స్థాపించారు, దీనిలో సంగీత గ్రంథాలు ఉంటాయి, ప్యాలస్ గ్రంథాలయం కోసం అనేక మంది సంగీత కళాకారుల యొక్క ఫోనోగ్రాఫ్ రికార్డింగ్లను కూడా ప్రారంభించారు. కృష్ణరాజా IV హయాంలో కళకు మరింత పోషణ లభించింది. ''రాగా'' మరియు ''భావా'' లకు ప్రాధాన్యత ఇచ్చిన ఒక ప్రత్యేక సంగీత పాఠశాల ప్రారంభమైంది.<ref name="paint" /><ref name="king">ప్రాణేష్ (2003), పే xiii ఆదర్స్ నోట్ లో</ref><ref name="high">కామత్ (2001), పే282</ref> కళ యొక్క వ్యవస్థీకృత భోదబోధనకు సాయపడిన రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ను ప్యాలస్లో స్థాపించారు. కర్ణాటక స్వరాలు ముద్రించబడ్డాయి, రాజ సంగీత కళాకారులు ఐరోపా సంగీత సంకేతాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. పాశ్చాత్య సంగీతం కూడా ప్రోత్సహించబడింది - రాజభవనం యొక్క సంగీత బృందంతో మార్గరెట్ కజిన్స్ పియానో కార్యక్రమాన్ని బెంగళూరులో బీథోవెన్ శతాబ్ది ఉత్సవాల్లో నిర్వహించారు.<ref name="Weidman 2006, p. 66" /> ప్రసిద్ధ కర్ణాటక ''కృతుల'' (ఒక సంగీత స్వరం) స్వరకర్తగా పేరొందిన మహారాజా జయచామరాజా రష్యా సంగీత కళాకారుడు నికోలస్ మెడ్నెర్ మరియు ఇతరుల యొక్క రికార్డింగ్లను ప్రాయోజితం చేశారు.<ref name="Weidman 2006, p. 66" /> ఆస్థానం కర్ణాటక సంగీతానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ కార్యకలాపాలు నిర్వహించింది. రాజభవనం యొక్క సంగీత బృందం గ్రామోఫోన్ రికార్డింగ్లు తయారు చేసి, వాటిని విక్రయించింది.<ref>వీడ్మన్ (2006), పే. 67</ref> సంగీత పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారు. వివిధ పరికరాలను సేకరించేందుకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేశారు, సాంప్రదాయకంగా కాని కొమ్ములుండే వయోలిన్, థియర్మిన్ మరియు ఒక యాంత్రిక సంగీత వాయిద్యం అయిన కాలియాఫోన్లు కూడా సేకరణల్లో భాగంగా ఉన్నాయి.<ref>వీడ్మన్ (2006), పే.68</ref> ఆ సమయానికి చెందిన అనేక మంది ప్రసిద్ధ విద్వాంసులు (''విద్వాన్'' ) మైసూరు ఆస్థానంలో ఉండేవారు. ఒక ఆస్థాన సంగీత కళాకారుడు వీణా శేషన్నా మహారాజా చామరాజా IX హయాంలో ఉన్నారు, <ref name="tayagacentre"/> [[వీణ]]ను వాయించడంలో అత్యంత గొప్ప కళాకారుల్లో ఆయన ఒకరిగా పేరొందారు.<ref name="expo">బక్షి (1996), పే.12; కామత్ (2001), పే.282</ref> శాస్త్రీయ సంగీతంలో ఆయన సాధనల ఫలితంగా వాయిద్య కర్ణాటక సంగీత కళలో మైసూర్కు ఒక ప్రధాన స్థానం దక్కింది, ఆయనను మహారాజా కృష్ణరాజ వడయార్ IV ''వైనిక శిఖామణి'' అనే గౌరవ బిరుదుతో సత్కరించారు.<ref name="shika">ప్రాణేష్ (2003), పేజీలు.110–111</ref><ref>{{cite web |url=http://hindu.com/thehindu/mp/2002/07/11/stories/2002071100260300.htm |title= The final adjustment |author= Satish Kamat|publisher=[[The Hindu]] |work= Metro Plus Bangalore|accessdate=2007-10-10}}</ref> మైసూర్ వాసుదేవాచార్య ఒక ప్రసిద్ధ సంగీత కళాకారుడు, మైసూర్లో ఆయన సంస్కృతం మరియు తెలుగు భాషల్లో స్వరాలు కూర్చారు.<ref name="vasudeva">సుబ్రమణియన్ (2006), పే.199; కామత్ (2001), పే.282</ref> ఆయన మైసూర్ రాజుల్లో నాలుగు తరాల వారి పోషణను పొందిన ఏకైక కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు, ముగ్గురు రాజుల వద్ద ఆయన ఆస్థాన సంగీత కళాకారుడిగా పని చేయడం గమనార్హం.<ref name="tayagacentre"/><ref name="tayagacentre"/> హెచ్.ఎల్. ముత్తయ్య భగవతార్ మైసూర్ ఆస్థానంలో ఉన్న మరో సంగీత స్వరకర్త.<ref name="mutiahbhagava">సుబ్రమణియన్ (2006), పే 202; కామత్ (2001), పే. 282</ref> [[త్యాగరాజు|త్యాగరాజ]] కాలం తరువాత అత్యంత ముఖ్యమైన స్వరకర్తల్లో ఆయన ఒకరిగా గుర్తించబడుతున్నారు, <ref name="tayagacentre"/> సంస్కృతం, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషల్లో ఆయన 400లకుపైగా స్వరాలు కూర్చారు, ఆయన కలం పేరు "హరికేశా". [[వయొలిన్|వయోలిన్]] కళాకారుల్లో టి.చౌడయ్య ఆ కాలంలో ఒక అత్యంత ప్రసిద్ధ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఏడు తీగలు ఉండే వయోలిన్ను ఆయన కనిపెట్టినట్లు గుర్తిస్తున్నారు.<ref name="notedmusician" /><ref name="chow">ప్రాణేష్ (2003), పే. 214, 216</ref> మహారాజా కృష్ణరాజ వడయార్ IV 1939లో చౌడయ్యను ఆస్థాన సంగీత కళాకారుడిగా నియమించారు, "సంగీత రత్న" మరియు "సంగీత కళానిధి" అనే బిరుదులు పొందారు. ఆయన కన్నడ, తెలుగు మరియు సంస్కృత భాషల్లో "త్రిమకుట" అనే కలం పేరుతో స్వర రచన చేశారు.<ref name="centre">[6] ^ ప్రాణేష్ (2003), పే. 162</ref/> ==వాస్తుశిల్పం== [[File:Chamundeshwari Temple Mysore.jpg|thumb|left|upright|చాముండి కొండపై చాముండేశ్వరి ఆలయం యొక్క గోపురం. మైసూర్ రక్షణ దేవత చాముండేశ్వరికి ఈ ఆలయాన్ని అంకితమిచ్చారు.]] (contracted; show full) మానస గంగోత్రిగా కూడా పిలిచే మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క ప్రాంగణంలో వాస్తుశిల్పానికి సంబంధించి ఆసక్తికరమైన పలు భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఐరోపా శైలిలో ఉంటాయి, వీటి నిర్మాణం 19వ శతాబ్దం చివరి కాలంలో పూర్తయింది. వీటిలో జయలక్ష్మి విలాస్ మాన్షన్, క్రాఫోర్డ్ హాలు, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (1887 మరియు 1891 మధ్యకాలంలో నిర్మించారు) భవనాలు లోనిక్ మరియు కోరిన్థియాన్ స్తంభాలతో కనిపిస్తాయి, జిల్లా కార్యాలయాలు (''అథరా కచేరీ'' , 1887) కూడా ఆసక్తికరమైన నిర్మాణాలు. ఒకప్పుడు బ్రిటీష్ కమిషనర్ కార్యాలయంగా ఉన్న అథరా కచేరీలో ఒక అష్టభుజ గోపురం మరియు దీని అందాన్ని మరింత పెంచే ఫైనియల్ ఉంటాయి.<ref name="octogen">రామన్ (1994), పే. 84</ref> 1880లో నిర్మించిన మహారాజా వేసవి విడిది భవనాన్ని లోకరంజన్ మహల్గా పిలుస్తారు, ఇది మొదట రాజ వంశీయులకు పాఠశాలగా ఉండేది. చాముండి కొండపై ఇండో-బ్రిటీష్ శైలిలో ఉన్న రాజేంద్ర విలాస్ ప్యాలస్ నిర్మాణాన్ని 1922లో ప్రారంభించారు, మహారాజా కృష్ణరాజా IV 1938లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.<ref name="lalith" /> మైసూర్ పాలకులు నిర్మించిన ఇతర రాజ భవనాల్లో మైసూర్లోని చిత్తరంజన్ మహల్ మరియు బెంగళూరులో బెంగళూర్ ప్యాలస్ ముఖ్యమైనవి, బెంగళూర్ ప్యాలస్ను ఇంగ్లాండ్ యొక్క విండ్సోర్ కాజిల్ స్ఫూర్తితో నిర్మించారు.<ref name="wind">బ్రాడ్నాక్ (2000), పే.294</ref> సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (చెలువాంబ మాన్షన్) ను బారోక్ యూరోపియన్ పునరుజ్జీవన శైలిలో నిర్మించారు, ఈ భవనం ఒకప్పుడు మహారాజా కృష్ణరాజ IV సోదరి, రాకుమారి చెలువంబామణి అవరు నివాసంగా ఉండేది. దీనిలో విస్తృతమైన పాలిస్టర్ అలంకరణలు మరియు మొసాయిక్ గచ్చు గమనార్హమైనవి.<ref name="baroque">రామన్ (1994), పేజీలు. 81–82</ref> వడయార్లు నిర్మించిన అనేక ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన [[చాముండేశ్వరీ ఆలయం]] చాముండి కొండపై ఉంది. ప్రారంభ నిర్మాణం 12వ శతాబ్దంలో జరిగింది, తరువాత ఈ ఆలయానికి మైసూర్ పాలకులు పోషకులుగా మారారు. మహారాజా కృష్ణరాజా III 1827లో ఈ ఆలయంలో ద్రావిడ-శైలి గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి దేవతల చిత్రాలు ఉన్న వెండి-ఫలకాలతో తలుపులు ఉంటాయి. ఇతర చిత్రాల్లో హిందూ దేవుడు [[వినాయకుడు]] మరియు మహారాజా కృష్ణరాజా III తన ముగ్గురు రాణులతో ఉంటారు.<ref name="hill">రామన్ (1994), పే. 85</ref> మైసూర్లో ప్రధాన ప్యాలస్ పరిసరాల్లో మరియు కోట లోపల ఐదు ఆలయాలు ఉన్నాయి, వీటిని వివిధ కాలాల్లో నిర్మించారు. అవి ప్రసన్న కృష్ణస్వామి ఆలయం (1829), లక్ష్మీరమణ స్వామి ఆలయం (ఈ ఆలయం యొక్క ప్రారంభ నిర్మాణం 1499లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి), త్రినేశ్వర స్వామి ఆలయం (16వ శతాబ్దం), హోయసాలా శైలి వాస్తుశిల్పంతో పూర్ణయ్య నిర్మించిన శ్వేత వరాహ స్వామి ఆలయం, ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం (1836, ఈ ఆలయంలో పన్నెండు మంది వడయార్ పాలకుల కుడ్యచిత్రాలు ఉన్నాయి).<ref name="atri">రామన్ (1996), పే. 83</ref> మైసూర్ నగరం వెలుపల ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో యాలీ ("పురాణ మృగం") స్తంభాలుగల వెంకటరమణ ఆలయం ముఖ్యమైనది, దీనిని [[బెంగళూరు]] కోటలో 17వ శతాబ్దం చివరి కాలంలో నిర్మించారు, [[ శ్రీరంగపట్నం]]లోని [[రంగనాథ ఆలయం]] కూడా ప్రసిద్ధి చెందింది.<ref name="notable temples">మిచెల్ పే.71</ref> టిప్పు సుల్తాన్ 1784లో శ్రీరంగపట్నంలో దరియా దౌలత్ ప్యాలస్ (''వాచ్యంగా'' "సముద్ర సంపద తోట") అనే పేరుతో పిలిచే ఒక కలప స్తంభాలు గల రాజ భవనాన్ని నిర్మించారు. ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించిన ఈ ప్యాలస్ ఆభరణాలను పోలిన తోరణాలు, నగిషీలు చెక్కిన స్తంభాలు మరియు గచ్చు ఆకృతులు మరియు చిత్తరువులకు ప్రసిద్ధి చెందింది. ప్యాలస్ యొక్క పశ్చిమ గోడపై కల్నల్ బైలీ సైన్యంపై(contracted; show full)నం చేసుకున్నారు, బ్రిటీష్ రాకెట్ అభివృద్ధిలో ఇవి ప్రభావం చూపాయి, కాంగ్రెవ్ రాకెట్ల నిర్మాణానికి ఇవి స్ఫూర్తిగా నిలిచాయి, వీటిని ఆ వెంటనే నెపోలియన్ యుద్ధాల్లో ఉపయోగించారు.<ref>రొడ్డం నరసింహ (1985). [http://nal-ir.nal.res.in/2382/01/tr_pd_du_8503_R66305.pdf రాకెట్స ఇన్ మైసూరు అండ్ బ్రిటిన్, 1750-1850 A.D.] నేషనల్ ఏరోనాటికల్ లేబొరేటరి అండ్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ అఫ్ సైన్స్.</ref> స్టీఫెన్ అలీవర్ ఫాట్ మరియు జాన్ ఎఫ్ గిల్మార్టిన్ జూనియర్లు ''ఎన్సైక్లోపీడియా బ్రిటానికా'' (2008) లో: [[మైసూరు|మైసూర్]] రాజు "[[హైదర్ అలీ]]" ఒక ముఖ్యమైన మార్పుతో యుద్ధ రాకెట్లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు; దహనమయ్యే పొడిని ఉంచేందుకు లోహ స్తంభాలు ఉపయోగించడం ముఖ్యమైన మార్పుగా పేర్కొన్నారు. ఆయన ఉపయోగించిన సుత్తితోకొట్టి మృదువుగా చేసిన ఇనుము ముడిదైనప్పటికీ, నల్ల మందు పాత్ర యొక్క పేలుడు సామర్థ్యం ముందు కాలానికి చెందిన కాగిత నిర్మాణం కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. తద్వారా అత్యధిక అంతర్గత పీడనం సాధ్యపడింది, దీంతో దూర ప్రాంతాలపై దాడికి అనువైన పరిస్థితి ఏర్పడింది. ఒక పొడవైన వెదురు కర్రకు తోలు వార్లత(contracted; show full)[[వర్గం:కర్ణాటక చరిత్ర]] [[వర్గం:భారత రాచరిక రాష్ట్రాలు]] [[వర్గం:మైసూరు రాజ్యము]] [[వర్గం:1399 ఏర్పాటు చేసిన రాష్ట్రాలు మరియు భూభాగాలు]] [[వర్గం:మైసూరు]] [[వర్గం:భారతదేశ చరిత్ర]] [[వర్గం:టిప్పూ సుల్తాన్]] [[వర్గం:హైదర్ అలీ]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=2004103.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|